LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం!

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతను సమర్థిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు. సెక్షన్ 5 సవరణ ద్వారా రాజధానిని కాపాడుకోవాలని, గత ప్రభుత్వ తప్పిదాలు పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు..

AndhraPravasi News Desk 1 min read
Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం!

Amaravati Legal Status: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సుస్థిరం చేస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టబద్ధతను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షణీయమని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరణ కోసం కేంద్రాన్ని కోరి నిర్ణయించడం అత్యంత న్యాయబద్ధమైన చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు.

రాజధాని విషయంలో గత ప్రభుత్వాల నిర్ణయాల వల్ల ఏర్పడిన అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడాన్ని షర్మిల స్వాగతించారు. గతంలో జగన్ వంటి నాయకులు అధికారంలోకి వచ్చి, అమరావతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజధానికి పటిష్టమైన చట్టపరమైన రక్షణ అవసరం అని షర్మిల విశ్లేషించారు. భవిష్యత్తులో ఎవరూ రాజధానిని మార్చలేని విధంగా చట్టాలను రూపొందించడం పాలకుల విజన్‌కు నిదర్శనమని కొనియాడారు.

విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పేర్కొన్న సెక్షన్ 5ను సవరించడం ద్వారా, అమరావతిని ఏకైక  శాశ్వత రాజధానిగా కేంద్ర రికార్డుల్లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంనీ కోరారు. దీనిపై షర్మిల స్పందిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కేంద్రం నుంచి అధికారికంగా ఆమోదం పొందే వరకు ప్రభుత్వం విశ్రమించకూడదని సూచించారు.

అమరావతి రైతులు, ప్రజలు పడిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, ఈ తీర్మానం వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఉందని  అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో గతంలో జరిగిన గందరగోళానికి ఈ చట్టబద్ధమైన చర్యల ద్వారా ముగింపు పలకవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చే సంప్రదాయానికి స్వస్తి పలికితేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని షర్మిల స్పష్టం చేశారు. అమరావతి మనుగడపై ప్రభుత్వం చూపుతున్న ఈ స్పష్టతను ఆమె సమర్థించడమే కాకుండా ఇది రాష్ట్ర ప్రజల విజయంగా అభివర్ణించారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…