LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandra Babu: అనంతపురంలో సీఎంచంద్రబాబు పర్యటన! నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి..

Chandra Babu Naidu: రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Chandra Babu: అనంతపురంలో సీఎంచంద్రబాబు పర్యటన! నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి..

యాడికిలో రైతులు, సాగునీటి సంఘాలతో సమావేశం కానున్న సీఎం.. 

జలవనరుల సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌.. 

రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

యాడికిలో రైతులు, సాగునీటి సంఘాల సభ్యులతో సీఎం సమావేశం కానున్నారు. నీటి వనరుల పరిరక్షణలో ప్రజలు, రైతులను భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి నీటి సంరక్షణపై అవగాహన పెంచే దిశగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సందర్భంగా జల వనరుల సంరక్షణ కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను యాడికి నుంచే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి జూలై 14 వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జల సంరక్షణలో భాగంగా సుమారు 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి కార్యాచరణను అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని అధికారులు తెలిపారు.

భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. వేసవిలో కనీసం 6 మీటర్లు, వర్షాకాలం తరువాత 3 మీటర్ల మేర భూగర్భ జలాలు ఉండేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే వర్షపు నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేలా సమగ్ర నీటి వినియోగ ప్రణాళికను అమలు చేయనున్నారు.

భవిష్యత్తులో నీటి అవసరాలు మరింత పెరగనున్న నేపథ్యంలో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. నీటి వనరులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఇప్పటికే ‘అవేర్ 2.0’ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.

నేడు సాగునీటి సంఘాలతో జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి మరిన్ని సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణకు కొత్త దిశ దక్కుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…