SBI Scholarship: ఎస్బీఐ గోల్డెన్ ఆఫర్! విద్యార్థులకు రూ.20 లక్షల స్కాలర్ షిప్! దరఖాస్తు వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్తగా విజయవాడ నుండి బెంగళూరు వరకు కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలు తిరుపతి మీదుగా నడవబోతుండటంతో భక్తులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడనుంది. దాదాపు ఐదు నెలలుగా చర్చలు సాగుతున్న ఈ రైలు ఇప్పుడు దీపావళి సమయానికి పట్టాలెక్కబోతుందని సమాచారం.

Chandrababu Tour: రేపు విశాఖలో సీఎం పర్యటన.. ఈ-గవర్నెన్స్ సదస్సు, అనంతరం అసెంబ్లీకి!

ఈ రైలు ప్రారంభమవడంతో బెంగళూరుకు వెళ్లే ప్రయాణ సమయం దాదాపు మూడు గంటలు తగ్గనుంది. ఇప్పటి వరకు విజయవాడ-బెంగళూరు ప్రయాణం ఎక్కువ సమయం పట్టేది. కానీ ఈ రైలు ద్వారా 8 నుంచి 9 గంటల్లోనే బెంగళూరుకు చేరుకోవచ్చని చెబుతున్నారు. అలాగే విజయవాడ నుండి తిరుపతికి కేవలం 4 గంటల్లోనే వెళ్లే అవకాశం ఉంటుంది.

ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం కృతజ్ఞతలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వారానికి ఆరు రోజులు నడపాలని ప్లాన్ చేశారు. మంగళవారం మాత్రం రైలు నడవదు. విజయవాడ నుండి ఉదయం 5.15కి బయలుదేరి మధ్యాహ్నం 2.15కి బెంగళూరు చేరుకునేలా టైమ్ టేబుల్ రూపొందించారు. మార్గమధ్యంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఇదే షెడ్యూల్ ఉంటుంది.

Modi Speech: తీపికబురు.. రేపటి నుంచి కొత్త చరిత్ర మొదలవుతుంది.. ప్రధాని మోదీ కీలక ప్రకటన!

ప్రస్తుతం విజయవాడ నుండి బెంగళూరు వరకు కొండవీడు ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. అది కూడా వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తుంది. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సౌకర్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Food Park: ఏపీలో కొత్తగా ఫుడ్ పార్క్! రూ.768 కోట్లతో...అక్కడే ఫిక్స్! ఆ ప్రాంతానికి మహర్దశ!

అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రారంభించే ఐదు కొత్త వందేభారత్ రైళ్లలో ఈ రైలు ఒకటిగా ఉంటుందని సమాచారం. ఒకసారి ఈ రైలు ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీ మరింత బలపడటమే కాకుండా, భక్తులు మరియు ఉద్యోగుల ప్రయాణానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Nara Lokesh Speech: రాయలసీమ ప్రజలకు శుభవార్త.. ఆర్డీటీకి ఆర్థిక సహాయం.. లోకేశ్ హామీ!
H1b Visa: న్యూయార్క్, డీసీలో కొత్త హెల్ప్‌లైన్లు! ఇండియన్ ఎంబసీ తాజా ప్రకటన! కన్ఫ్యూజన్ వద్దు!
Indian Woman: అమెరికాలో మరో ఘోరం.. భారత మహిళను స్టోర్‌లోనే కాల్చి చంపిన దుండగుడు! సీసీటీవీలో..
Mahalaya Amavasya: మహాలయ అమావాస్య... ఈరోజు ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా!
Passport update: ఇకపై అన్ని కేంద్రాల నుండి ఈ-పాస్‌పోర్ట్ జారి! ప్రస్తుతం పాస్ పోర్ట్ చెల్లుబాటు అవుతుందా?