LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Farmers: శనగల కొనుగోలు పెంపుపై కేంద్రంతో చర్చలు.. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు!

Farmers: రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రంతో కీలక చర్చలు జరిపారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

AndhraPravasi News Desk 1 min read
Farmers: శనగల కొనుగోలు పెంపుపై కేంద్రంతో చర్చలు.. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు!

కేంద్రమంత్రి శివరాజ్‍సింగ్‍తో వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి అచ్చెన్న..

శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరిన మంత్రి..

అమరావతి: రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రంతో కీలక చర్చలు జరిపారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, రాష్ట్ర పరిస్థితిని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ సీజన్‌లో మొత్తం 7.13 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే రైతులకు మరింత ఉపశమనం కల్పించేందుకు కొనుగోలు లక్ష్యాన్ని 1,78,250 టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్ర అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, అదనంగా 15 వేల టన్నుల శనగల కొనుగోలుకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఇంకా మిగిలిన 68,750 టన్నుల శనగలను కూడా కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొనుగోళ్లు సకాలంలో జరిగేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో పంటల మార్పిడి ప్రభావంపై కూడా మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించారు. మిర్చి, పొగాకు రైతులు పంటలను మార్చుకోవడంతో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. అధిక దిగుబడి కారణంగా మార్కెట్‌లో మొక్కజొన్న సరఫరా ఎక్కువైందని తెలిపారు. మరోవైపు, ఇథనాల్ తయారీలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగడంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గినట్లు వివరించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన ధరలు, స్థిరమైన మార్కెట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…