Recharge Plans: ఆ యూజర్లకు మంచి ఛాన్స్.. 5 నెలలు ఉచితం.. ఎలా పొందాలంటే? కేవలం కాల్స్, డేటా ఇవ్వడమే కాదు!

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఈ రైళ్లను కొత్త కొత్త మార్గాల్లో ప్రవేశపెట్టి ప్రజలకు మరింత సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటివరకు 150కి పైగా వందే భారత్ రైళ్లు దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య నడుస్తున్నాయి.

Scam RTC: నమ్మకంపై వేటు.. ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో భారీ స్కామ్! ఏకంగా రూ.65 లక్షలు స్వాహా, 29 మందిపై కేసు నమోదు.!

సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆధునిక సదుపాయాలు, వేగవంతమైన ప్రయాణం అందుబాటులో ఉండటంతో ప్రయాణికుల నుంచి వీటికి మంచి స్పందన లభిస్తోంది. పండగ సమయాల్లో టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ రైళ్లతో పోలిస్తే టికెట్ ధర కొంత ఎక్కువైనా – త్వరగా గమ్యానికి చేరుకోవడమే కాక, సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం వల్ల ప్రజలు ఈ రైళ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

US Education: ట్రంప్ షాక్.. ఎఫ్‌-1 వీసా నిబంధనల్లో త్వరలో మార్పులు.. డాలర్ డ్రీమ్స్ ఇక కష్టమేనా?

సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కూ పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలుకు మరిన్ని స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి వెల్లడించారు.

Smart Cards: ఏపీలో మహిళలకు మరో గుడ్‌న్యూస్! ఉచిత బస్సు ప్రయాణానికి స్మార్ట్ కార్డులు!

ఇకపై నాగ్‌పూర్ – సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ స్టేషన్లలో కూడా ఆగనుంది. నాగ్‌పూర్ నుంచి తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరే రైలు (20101) మధ్యాహ్నం 12:15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే విధంగా మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైలు (20102) రాత్రి 8 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది.

BSNL PAY: యూపీఐ మార్కెట్లోకి బీఎస్ఎన్ఎల్.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పేలకు షాక్ తప్పదా! 5G తో డిజిటల్ దూకుడు..

ప్రస్తుతం ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, ఖాజీపేట్ లలో ఆగుతుంది. కొత్తగా సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల్ కూడా ఈ జాబితాలో చేరాయి. ఈ హాల్ట్ సౌకర్యం ప్రారంభమైన తర్వాత రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు మరింత సౌకర్యం కలుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

BSNL Plan: BSNL సంచలనం.. రూ.1కే సిమ్ కార్డు! అన్‌లిమిటెడ్ కాల్స్, 2GB డేటా ఫ్రీ!
Special Trains: రైల్వే నుంచి ప్రయాణికులకు తీపి కబురు! 150 పండుగ ప్రత్యేక రైళ్లు..
Intermediate Exams: ఏపీ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం! పరీక్షల విధానంలో భారీ మార్పులు.. నెల ముందుగానే షెడ్యూల్
Thai constitutional: ఒక సంవత్సరం పాలన.. వివాదాలతో ముగిసిన షినవత్రా అధ్యాయం!