Special Trains: రైల్వే నుంచి ప్రయాణికులకు తీపి కబురు! 150 పండుగ ప్రత్యేక రైళ్లు..

ఇటీవలి కాలంలో దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. నేరుగా ధరలు పెంచకపోయినా, ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ ప్లాన్స్‌లో మార్పులు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నాయి. ఉదాహరణకు, డైలీ 1GB డేటా ప్లాన్లను తీసేసి, ఎక్కువ డేటా ఇచ్చే కానీ ఎక్కువ ధర గల ప్లాన్లను ప్రవేశపెట్టారు. దీంతో సాధారణ వినియోగదారులు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ పరిస్థితిలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మాత్రం వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన కొత్త ఆఫర్లను తీసుకొస్తూ ముందుకు సాగుతోంది.

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్ ఇక సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు! సింపుల్ గా ఇలా!

గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి దిగ్గజ సంస్థలు టారిఫ్ ధరలను భారీగా పెంచాయి. గరిష్టంగా 25 శాతం వరకు పెంచడం వల్ల రీఛార్జ్ వినియోగదారులకు మరింత భారంగా మారింది. ఆ సమయంలో కూడా బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలను పెంచకుండా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ విధానం వల్ల బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కూడా పెరిగింది. ఇదే కాకుండా, ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ప్లాన్లు ఇతర కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటం గమనార్హం.

Bullet Train: ఈ రైలు వేగం గంటకు 320 కిలో మీటర్లు.. భారత్ బుల్లెట్‌ ట్రైన్‌పై మరో పెద్ద అప్‌డేట్‌! వీటి ప్రత్యేకత ఏంటంటే.?

ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలలో 28 రోజుల కాలానికి కనీసం రూ. 299 నుంచి ఎంట్రీ లెవెల్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే బీఎస్ఎన్ఎల్ మాత్రం రూ. 200 లోపే ప్లాన్లను వినియోగదారులకు ఇస్తోంది. ఉదాహరణకు రూ. 199 ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMSలు అందిస్తుంది. దీనితో వినియోగదారులు తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇదే కాకుండా, బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

Balakrishna Helpng Hand: నిజమైన హీరో.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం.! బాలకృష్ణ గొప్ప మనసు..

ఆ ఆఫర్ పేరు ‘ఫ్రీడమ్ ప్లాన్’. ఈ ప్లాన్ కింద వినియోగదారులు కేవలం ఒక రూపాయికే కొత్త సిమ్ పొందగలరు. అంతేకాకుండా, రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో పాటు 30 రోజుల వాలిడిటీని కూడా పొందుతారు. ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అంటే ఆగస్టు 31న సిమ్ తీసుకుంటే, సెప్టెంబర్ 30 వరకు అన్ని ప్రయోజనాలు పొందొచ్చు. కానీ సెప్టెంబర్ 1 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని స్పష్టం చేసింది.

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ ఉన్నవారికి బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి! నిమిషాల్లో పని పూర్తి!

ఇక మరోవైపు, బీఎస్ఎన్ఎల్ OTT కంటెంట్, లైవ్ టీవీ సేవల వైపు అడుగులు వేస్తోంది. ఇటీవలే ‘BITV’ అనే సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ప్రీమియం ప్యాక్ రూ. 151 ధరతో లభిస్తోంది. ఇందులో 25కు పైగా OTT యాప్స్, 450కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా టెలికాం సేవలతో పాటు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌లో కూడా బీఎస్ఎన్ఎల్ పోటీని ఇస్తోంది. మొత్తం మీద ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచుతున్న సమయంలో, బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరలకు మంచి ఆఫర్లు అందిస్తూ వినియోగదారులకు పెద్ద సపోర్ట్‌గా నిలుస్తోంది.

Dilse Australia: దిల్సే ఆస్ట్రేలియా బృందం ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ మహోత్సవం! పాల్గొన్న NRI టీడీపీ ప్రముఖులు!
Godavari: గోదావరి ఉగ్రరూపం! 48 అడుగుల దాటిన నీటిమట్టం! రెండో ప్రమాద హెచ్చరికలు జారీ!
Free Bus: స్త్రీ శక్తి పథకంలో మరో శుభవార్త! ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం!
Thai constitutional: ఒక సంవత్సరం పాలన.. వివాదాలతో ముగిసిన షినవత్రా అధ్యాయం!