ఇటీవలే విడుదలైన కాంతర సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి తన నటనతో థియేటర్లలోనే కాకుండా ప్రజల గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో ఆయన ప్రదర్శన చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలు చేస్తూ చిత్రంలోని భక్తి శక్తి భవ్యం కలిసిన దృశ్యాలకు మంత్ర ముగ్ధులవుతున్నారు. స్థానిక సంస్కృతి, దైవారాధనతో కూడిన కథనాన్ని తెరపైకి తెచ్చి ఆయన నటనకు ఒక రసానుభూతి .
ఇదే సమయంలో తెలుగు సినిమా అభిమానులకు పుష్ప ది రైజ్ గుర్తు తప్పక వస్తోంది. అల్లు అర్జున్ తన ప్రత్యేకమైన మేకోవర్, డైలాగ్ డెలివరీ, మరియు స్టైల్తో దేశవ్యాప్తంగా ఒక జనహృదయరంజకం సృష్టించాడు. ఆయన నటనకు లభించిన జాతీయ చలనచిత్ర పురస్కారం ఆయన స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో, పుష్పకి అవార్డు వచ్చిందంటే, కాంతరకు ఎందుకు రాకూడదు? అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.
నెట్టింటా నెటిజన్లు ఈ రెండు చిత్రాలను పోలుస్తూ వాదనలు మొదలుపెట్టారు. కొందరు పుష్పలో మాస్ యాక్షన్ ఉంది, కాంతరలో లోకసంస్కృతి ఉంది అని తర్కిస్తుంటే, మరికొందరు ఇద్దరి నటనలోనూ ఒకే రకం ఆత్మవిశ్వాస ఉందని అంటున్నారు.
నటన పరంగా చూస్తే ఈ ఇద్దరి ప్రయాణం వేరు అయినా, ప్రేక్షకుల హృదయాల్లో సాధించిన స్థానం మాత్రం ఒకటే. అల్లు అర్జున్ తన స్టైల్, స్వాగ్తో ఆకట్టుకోగా, రిషబ్ శెట్టి తన ఆధ్యాత్మికత, సంస్కృతితో మైమరిపించాడు. ఇద్దరి నటనలో ఉన్న భిన్నతలు వారి చిత్రాల వైశిష్ట్యాన్ని చూపించాయి.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ మోతమోగుతోంది. పుష్పకి నేషనల్ అవార్డు వచ్చినట్లే, కాంతర చిత్రానికి కూడా అవార్డు రావాలని నెటిజన్లు బలంగా వాదిస్తున్నారు. రిషబ్ శెట్టి నటన, కథలోని ఆధ్యాత్మికత, భక్తి–భావాలు జాతీయ స్థాయి గుర్తింపుకు రావాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.