LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Tollywood Viral News: హైదరాబాద్‌లో రణవీర్ సింగ్ సినిమా చూస్తూ కనిపించిన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా..!

Tollywood Viral News: రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమాను చూస్తూ కనిపించారు. 'స్పిరిట్' సినిమా షూటింగ్ విరామంలో వీరు ఇలా బయట కనిపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది

AndhraPravasi News Desk 2 min read
Tollywood Viral News: హైదరాబాద్‌లో రణవీర్ సింగ్ సినిమా చూస్తూ కనిపించిన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా..!

Tollywood Viral News: రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'ధురంధర్ 2' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా క్రేజ్ సామాన్యులనే కాదు, సినీ సెలబ్రిటీలను కూడా థియేటర్ల వైపు రప్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్  సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో ఈ సినిమాను వీక్షిస్తూ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో కాస్త విరామం దొరకడంతో, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చూడటానికి వెళ్లారు. థియేటర్లో ప్రభాస్ బ్లాక్ డ్రెస్సులో చాలా సింపుల్‌గా కనిపిస్తే, సందీప్ వంగా బ్లూ కుర్తాలో కనిపించారు. వీరు సినిమా చూస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను చూసి "స్పిరిట్ కాంబో అదిరిపోయింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, ఈ వార్తతో పాటు ఒక పాత వివాదం కూడా మళ్ళీ చర్చకు వచ్చింది. నిజానికి 'స్పిరిట్' సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. రెమ్యూనరేషన్ విషయంలోనూ, అలాగే పని గంటల విషయంలోనూ దీపికా పెట్టిన నిబంధనలకు టీమ్ అంగీకరించలేదని సమాచారం. ముఖ్యంగా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని ఎంపిక చేశారు.

సందీప్ రెడ్డి వంగాకు రణవీర్ సింగ్ నటన అంటే మొదటి నుంచి మంచి గౌరవం ఉంది. 'ధురంధర్' మొదటి భాగం విడుదలైనప్పుడే ఆయన రణవీర్ పెర్ఫార్మెన్స్‌ను తెగ పొగిడారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు  స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉన్నాయని, అందుకే రెండో భాగాన్ని కూడా థియేటర్లోనే చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా రణవీర్ నటనను ఎంజాయ్ చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ 'స్పిరిట్' సినిమా అప్డేట్స్ కోసం  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ - సందీప్ వంగా కలిసి సినిమా చూడటంతో, వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ఖచ్చితంగా 'స్పిరిట్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…