Fee Deadline: ఏపీ ఇంటర్ ఫీజు గడువును పొడిగింపు..! ఫస్ట్ & సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

న్యూఢిల్లీలోని అఫ్గానిస్థాన్ ఎంబసీ వద్ద జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. అఫ్గానిస్థాన్ తాత్కాలిక తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో భాగంగా గురువారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

ఆ చేపలు కోసం.. అక్కడి ప్రభుత్వం అంత ఖర్చు చేస్తుందా?

అయితే ఆ ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై రాజకీయ నాయకులు తీవ్రంగా స్పందించారు.

Google Doodle: గూగుల్ డూడిల్ ఉత్సవం! ఇడ్లీ కి గ్లోబల్ గుర్తింపు!

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా జర్నలిస్టులను ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి తప్పించడం చాలా షాకింగ్ ఉంది ఆ సమయంలో పురుష జర్నలిస్టులు కూడా నిరసనగా బయటకు రావాలి  అని ఆయన X (ట్విట్టర్) లో రాశారు.

Indigo flight: ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..! పైలట్ అప్రమత్తతతో..!

తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రా కూడా తీవ్రంగా స్పందించారు. “భారత భూభాగంలో తాలిబాన్ విదేశాంగ మంత్రి మహిళా జర్నలిస్టులను ఎందుకు నిషేధించాడు? ఆ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ ఎలా అనుమతి ఇచ్చారు? మన పురుష జర్నలిస్టులు కూడా ఎందుకు మౌనంగా అక్కడ కూర్చున్నారు? అని ఆమె ప్రశ్నించారు.

Modi: ఈనెల 16న కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఉదయం 7.50కి ఢిల్లీ నుండి!

ఈ ఘటనపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) మాత్రం తమకు ఈ ప్రెస్ మీట్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నిన్న అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

Rishab Shetty: రికార్డుల వేటలో రిషబ్ శెట్టి! బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతున్న కాంతారా ఛాప్టర్1 !

తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ అక్టోబర్ 9 నుంచి 16 వరకు భారత్ పర్యటనలో ఉన్నారు. 2021లో తాలిబాన్ అఫ్గానిస్థాన్‌పై నియంత్రణ సాధించిన తర్వాత, ఇది మొదటి హై లెవెల్ ప్రతినిధి బృందం భారత్‌కి వచ్చిన సందర్భం.

Education: చదువు మధ్యలో మానేసిన వారికి మరో అవకాశం..! ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త పథకం..!

పర్యటన మొదటి రోజున ముత్తాఖీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను కలసి రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.అదే సందర్భంలో భారత్, అఫ్గానిస్థాన్‌లో ఆరోగ్య రంగానికి సంబంధించిన కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది.

చైనా దూకుడు వైఖరిపై ట్రంప్ ఆగ్రహం.. సాఫ్ట్‌వేర్‌ల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు!!

ఈ సంఘటనతో భారత రాజకీయ వర్గాల్లో చర్చలు ముదురుతున్నాయి. కొందరు నాయకులు దీన్ని మహిళలపై వివక్ష, భారత గౌరవానికి మచ్చ అని చెబుతుండగా, మరికొందరు దీన్ని కేవలం తాలిబాన్ నిర్వహించిన ప్రైవేట్ ఈవెంట్‌గా పేర్కొంటున్నారు. మొత్తం మీద తాలిబాన్ మంత్రి పర్యటన భారతదేశంలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ వివక్ష — దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చలకు కేంద్ర బిందువుగా మారింది.

Happy Nest: హ్యాపీ నెస్ట్ నిర్మాణం ఊపందుకుంది.. 12 టవర్లలో 1200 ఫ్లాట్లు!
ఆ ప్రాంతాన్ని డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దే లోకేష్ ప్లాన్! రూ.1,500 కోట్లతో ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌.. అక్కడే ఫిక్స్!