బంగ్లాదేశ్లో చేపలలో హిల్సా అనే చేప చాలా ప్రసిద్ధి చెందింది. హిల్సా ఎక్కువగా బంగ్లాదేశ్లోనే అధికంగా ఉత్పత్తి అవుతుంది ఈ చేపకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. 2017లో హిల్సాకు జియోగ్రాఫికల్ ఇండికేటర్ (GI) గుర్తింపు ఇచ్చారు. ఈ కారణంగా హిల్సా చేప ప్రత్యేకంగా గుర్తింపు పొందినది. స్థానికంగా ఈ చేపను “డార్లింగ్ ఆఫ్ వాటర్స్” లేదా “ప్రిన్స్ ఎమాంగ్ ఫిష్” అని కూడా పిలుస్తారు.
బంగ్లాదేశ్లో హిల్సా చేప ప్రధానంగా అక్టోబర్ నెలలో సంతానోత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. చేపలు సురక్షితంగా పెరుగేలా, వేట చేసేవారిని నియంత్రించేలా పలు చర్యలు చేస్తారు. ప్రధానంగా పద్మా నదిలో హిల్సా చేపలు తన సంతానోత్పత్తి చేస్తాయి. 2012 నుండి బంగ్లాదేశ్ ప్రభుత్వం హిల్సా చేపలను ఎగుమతించడం నిషేధించింది.
అయినప్పటికీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారం రోజుల పాటు పరిమితంగా హిల్సా చేపలను భారత్కు ఎగుమతి చేస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో కొన్ని రోజుల పాటు ఈ నిషేధాన్ని తాత్కాలికం చేస్తారు. ఈ ఏడాది దసరా సందర్భంగా 1200 టన్నుల హిల్సా చేపలను భారత్కు ఎగుమతి చేశారు. భారత్లో కూడా హిల్సా చేపకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా కోల్కతా మార్కెట్లో కిలో వెయ్య రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ధర ఉంది.
హిల్సా చేపల వేటను నియంత్రించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 4 నుండి 25 వరకు మూడు వారాల పాటు నిషేధం విధించింది. ఈ సమయంలో చేపల వేటను ఆపడానికి పోస్టర్లు, కరపత్రాలు, మార్కెట్లలో లౌడ్స్పీకర్లతో ప్రజలకు తెలియజేశారు. స్థానిక పోలీసులు, నేవీ కోస్ట్గార్డ్, ఎయిర్ ఫోర్స్ పాల్గొని పెద్ద ఆపరేషన్ నిర్వహించారు. తీర ప్రాంతాల్లో 17 యుద్ధనౌకలు పెట్రోలింగ్ హెలికాప్టర్లను మోహరించారు.
ప్రాంతీయ నదులు, సముద్రాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. సముద్రంలోకి స్థానికులు, విదేశీ మత్స్యకారులు చొరబడకుండా చూసారు. ఈ ఆంక్షలను ఉల్లంఘించిన 100 మందిని అరెస్ట్ చేశారు. అలాగే పటువాఖాలీలో దాదాపు 80 వేల మంది మత్స్యకారులకు నిషేధిత కాలంలో 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.అయితే ఇదే హిల్సా ఆంధ్రప్రదేశ్లో పులస అని పిలుస్తారు. ముఖ్యంగా గోదావరి నదిలో ఈ చేప ఎక్కువగా లభిస్తుంది. పులస చేప సీజనల్గా మాత్రమే వస్తుంది. ఇది రుచికరమైన చేపగా ప్రసిద్ధి చెందింది. దసరా, సంక్రాంతి సమయాల్లో లభిస్తుంది