LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..

PM Modi: బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హల్దియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోయారని గుర్తు చేశారు. ఈసారి రాష్ట్రమంతా అదే ఫలితం వస్తుందని అన…

AndhraPravasi News Desk 1 min read
PM Modi: బీజేపీ రాగానే జైలుకు వెళ్లక తప్పదు.. ఆ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్..
  • Politics: నాడు నందిగ్రామ్.. నేడు రాష్ట్రమంతా: బెంగాల్‌లో టీఎంసీ పతనం మొదలైందన్న మోదీ..
     
  • శరణార్థులకు అండ.. చొరబాటుదారులకు గుమ్మం మూత: బెంగాల్ గడ్డపై మోదీ కీలక ప్రకటన…

PM Modi: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయం సాధించడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. హల్దియాలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గత ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిని చవిచూశారని గుర్తు చేస్తూ, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అదే ఫలితం పునరావృతమవుతుందని విశ్లేషించారు. ప్రస్తుతం ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్‌లో సైతం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, బెంగాల్ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి ఈ ఎన్నికలు ఒక గొప్ప అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం మొత్తం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా, టీఎంసీ ప్రభుత్వం అడ్డుతగులుతూ బెంగాల్ అభివృద్ధిని కుంటుపరుస్తోందని మండిపడ్డారు.

యువతకు ఉపాధి కల్పించడంలో మమతా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తోందని ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ హయాంలో జరిగిన మోసాలు, కుంభకోణాలను బీజేపీ అధికారంలోకి రాగానే ప్రజల ముందు ఉంచుతామని, అన్యాయానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. బెంగాల్‌లో 'డబుల్ ఇంజిన్ సర్కార్' ఏర్పడితేనే కేంద్ర పథకాలు క్షేత్రస్థాయిలోకి చేరుతాయని, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని ఆయన హామీ ఇచ్చారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, అయితే దేశ భద్రతకు ముప్పుగా మారిన చొరబాటుదారులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారిని తరిమికొడతామని మోదీ స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…