LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.!

AP Government: మీ భూములకు రక్షణ కల్పిస్తూ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

AndhraPravasi News Desk 3 min read
AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.!
  • సూపర్ సిక్స్ పథకాలతో సామాన్యుడికి భరోసా: అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కూటమి పాలన..
     
  • Politics: అమరావతికి చట్టబద్ధత తర్వాత తొలి సభ: బాపట్ల జిల్లాలో భూ హక్కుల పండుగ!

Bapatla AP Government: మీ భూమి-మీ హక్కు గ్రామసభ, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం గురువారం భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులు పాస్ పుస్తకాలను చూపుతూ హర్షాతీ రేఖలు కరతాలధ్వనుల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం చేశారు. పి4 కి స్పందిస్తూ యాజలి గ్రామానికి సత్యనారాయణ రాజు ఒక కోటి రూపాయలను చెక్కు రూపంలో విరాళంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి  అందజేశారు. ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.
       
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కేంద్రం ఆమోదించిన తదుపరి తొలి సభ బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలంలో జరగడం సంతోషదాయకమని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. రెవిన్యూ సమస్యలన్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మీ భూములకు రక్షణ కల్పించడం, శాశ్వతంగా మీ భూమికి యాజమాన్య హక్కు కల్పిస్తూ రాజమద్రతో పట్టాదారుపాస్ పుస్తకాలు  ఇస్తున్నామన్నారు. ఎక్కడ తప్పులు జరగకుండా పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో విశ్వసనీయతను కల్పిస్తూనే... సూపర్ సిక్స్ పథకాలను అద్భుతంగా అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికీ బంగారు భవిష్యత్తు కల్పించడం కొరకే రాజధాని అమరావతిని సాధించినట్లు అభివర్ణించారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ఆశిస్తున్న అమరావతిని రాజధానిగా కేంద్రంలో చట్టబద్ధత పందేల సీఎం కృషి చేశారన్నారు. దేవతలు నివాసం ఉన్న అమరావతిని రాజధానిగా పొందడం గొప్ప భాగ్యం అన్నారు. ఐ.టి.మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచనలతో దేశంలో పెట్టుబడులన్ని రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
        
మనభూమికి మన హక్కులు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి  చేస్తున్నారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు, పానెల్ స్పీకర్, హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. మన జిల్లాకు వచ్చి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం సంతోషదాయకమన్నారు. అమరావతి రాజధాని బిల్లు ఢిల్లీకి రాగానే మద్దతుపై లోక్ సభలో ప్రకటన చేయగా 11 జాతీయ పార్టీలు, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించడం అభినందనీయమన్నారు. ఆ సమయంలో లోక్ సభ పానెల్ స్పీకర్ గా నేను ఆమోద ముద్ర వేయడం, తెలుగు బిడ్డగా నా జన్మ సుకృతం అయ్యిందన్నారు. 

ఢిల్లీ లోక్ సభలో తెలుగు బిడ్డగా స్పీకర్ స్థానంలో ఉండి ఆమోదించడంలో భావోద్వేగానికి గురయ్యానని గుర్తు చేసుకున్నారు. సభ్యుల ఆమోదం కోరడం, ఆమోదించడం నా జీవితంలో మరుపురాని రోజు అన్నారు. అమరావతికి రాజముద్ర లభించిందని, సింగపూర్ మాదిరిగా అమరావతి అభివృద్ధి చేయడానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. బాపట్ల జిల్లాలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.8వేల కోట్లు నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు. అలాగే జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.6 వేల కోట్లు ప్రతిపాదనలు పంపామని, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కావాలని ప్రతిపాదనలు పంపామన్నారు.
         
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాపట్ల జిల్లాకు రావడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. గ్రామ ప్రజలు ఆసక్తిగా కార్యక్రమానికి హాజరు కావడం అభినందనీయం అన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి ఐదు వారాలలో అర్హమైన వాటిని తొలగించి భూమి హక్కు కల్పిస్తామన్నారు.
            
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. తుంగభద్ర కాల్వ మరమ్మతు పనులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని ముఖ్య మంత్రిని కోరారు. పొన్నూరు రోడ్డుపై హెచ్ ఎల్ పి నిర్మాణానికి రూ.15 కోట్లు కావాలని, భట్టిప్రోలు- పెసర్లంక కల్వర్టు నిర్మాణానికి రూ.రెండు కోట్లు నిధులు కావాలని, జువ్వలపాలెం రహదారుల మరమ్మతులు, గ్రోయింగ్ నిర్మాణానికి రూ.రెండు కోట్లు, అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు చేయాలని, జంపని గ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆ భూమిని  ఎం ఎస్ ఎం ఈ పార్కుగా నిర్మించాలని కోరారు.
     
నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉప్పల నాంచారయ్య, రైతు, భట్టిప్రోలు మండలం. ఎంతో కాలంగా తాతావారిపాలెంలో సాగు చేసుకుంటున్న నా భూమికి హక్కు పత్రాలు లేవు. ఎన్నోసార్లు అధికారులు కలిసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడేమో నా భూమికి  రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. జీవిత కాలం రుణపడి ఉంటా. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సి సి ఎల్ ఎ కార్యదర్శి జయలక్ష్మి, ఐఏఎస్ అధికారి ప్రత్యూమ్న, జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, డి ఆర్ ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…