LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా

Prajavedhika: మంగళగిరి గ్రీవెన్స్‌లో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరానికి వైసీపీ నేతల భూ కబ్జాలపై పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

AndhraPravasi News Desk 2 min read
Prajavedhika: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్కామ్... భూ కబ్జాలపై బాధితుల గర్జన! గ్రీవెన్స్‌లో వెల్లువెత్తిన వైసీపీ నేతల అక్రమాల చిట్టా

Politics- వారసత్వ భూమిపై వైసీపీ నేతల కన్ను.. ఐదుగురు ఆడపిల్లల తండ్రి కన్నీటి గాథ.

సర్వే పేరుతో భూమి మాయం! 1 ఎకరా 80 సెంట్లు ఎలా అయ్యింది?

సైనికుడి భూమిని కూడా వదలని కబ్జాదారులు.. చర్చి కట్టేసి దౌర్జన్యం!

Prajavedhika: మంగళగిరి గ్రీవెన్స్ కార్యక్రమంలో భూ ఆక్రమణల అంశం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లా మదిగుబ్బ గ్రామానికి చెందిన గంగవరం నాగరాజు తన గోడును వెళ్లబోసుకుంటూ.. 1994 నుంచి సాగులో ఉన్న తమ భూమిని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థానిక వైసీపీ సర్పంచ్ తన పేరు మీద మార్చుకున్నారని ఫిర్యాదు చేశారు. అధికారుల అండతో సర్పంచ్ దౌర్జన్యం చేస్తున్నారని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని కోరారు. అలాగే పల్నాడు జిల్లా యండ్రాయికి చెందిన కర్రి అశోక్.. సర్వే పేరుతో తమ తల్లికి చెందిన ఒక ఎకరా భూమిని 80 సెంట్లుగా చూపిస్తూ వైసీపీ నేతలు మిగిలిన భాగాన్ని కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేటకు చెందిన సోమేజు వెంకటేశ్వర్లు.. ఐదుగురు ఆడపిల్లలు, అనారోగ్యంతో ఉన్న భార్యను సాకుతున్న తనకు వారసత్వంగా వచ్చిన 1.52 ఎకరాల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్సీకి వివరించారు. మరోవైపు తెనాలి మండలం పిన్నపాడుకు చెందిన పేనుమర్తి బాలకోటేశ్వరి.. మాజీ సైనికుడైన తన తాతగారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కొందరు కబ్జా చేసి చర్చి, షెడ్లు వేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు.

భూ సమస్యలతో పాటు కుటుంబ వివాదాలు కూడా గ్రీవెన్స్‌కు చేరాయి. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వై. హిమబిందు.. తన భర్త యాళ్ల రామ్ కుమార్ వరకట్నం కోసం వేధిస్తూ, నగదు, బంగారం, భూ పత్రాలు తీసుకుని తనను పుట్టింటి వద్ద వదిలేశారని న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యలన్నింటినీ సావధానంగా విన్న ఎమ్మెల్సీ రాజశేఖరం.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

కేవలం భూ సమస్యలే కాకుండా, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా పలువురు అర్జీలు అందజేశారు. నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కోసం తమ రెస్యూమ్‌లను సమర్పించగా, అనారోగ్యంతో ఉన్న మరికొందరు ఆర్థిక సాయం కోసం అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…