ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనంతపురం మాజీ లోక్సభ సభ్యుడు దరూరు పుల్లయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం కర్ణాటక లోని బళ్లారిలో ఆయన నివాసం ఉంటున్నారు. సోమవారం నాడు ( మే 12, 2025 ) బళ్లారి నుంచి కంప్లి కొట్టాలలో ఉన్న తన పొలాన్ని చూడడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కంప్లిలో స్నేహితులతో మాట్లాడేందుకు కారు దిగగా అక్కడే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
పుల్లయ్య పార్థివ దేహాన్ని బళ్లారిలోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన సొంతూరు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం. ఆయనకు భార్య సత్యవతి, ఆరుగులు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మద్రాస్ లో లా పూర్తి చేశారు. పుల్లయ్య మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నెల 14వ తేదీ, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కమ్మ సంఘం నేతలు సంతాపం తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!
ఉరవకొండ నియోజకవర్గం నుంచి 1962లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1968 నుంచి 1974 వరకు ఉరవకొండ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రెండు సార్లు గెలుపొందారు.
1977-79, 1982-85 మధ్య అనంతపురం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.
1965 నుంచి 1977 వరకు కంప్లి షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా, బీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా విధులు చేపట్టారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: