Airport: యూరప్ విమానాశ్రయాలపై భారీ సైబర్ దాడి..! వేలాది ప్రయాణికులు బంధీలా..!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రూప్‌ 2 పోస్టుల తుది ఫలితాల కోసం వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే తుది జాబితా సిద్ధం చేసే పనిలో నిమగ్నమైందని సమాచారం. నిజానికి ఈ ఫలితాలను మూడునెలల క్రితమే ప్రకటించాల్సి ఉండగా, గ్రూప్‌ 1 పోస్టుల చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదాలు కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అవాంతరాలు తొలగించడంతో ఫలితాల విడుదలకు కౌంట్‌డౌన్‌ మొదలైనట్లైంది.

IND vs PAK: అభిమానులకు బెస్ట్ ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడం మా లక్ష్యం.. సూర్య IND vs PAK!

2022లో విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం మొత్తం 783 పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 2024 డిసెంబరులో జరిగిన ఆఫ్‌లైన్‌ రాత పరీక్షకు 2,49,964 మంది హాజరయ్యారు. అయితే, ఓఎంఆర్‌ షీట్లలో పొరపాట్లు, బబ్లింగ్‌ లోపాలు వంటి కారణాలతో 13,315 మందిని కమిషన్‌ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మందికి సంబంధించిన మార్కులతో జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. మార్చి 11న విడుదలైన ఈ లిస్ట్ ఆధారంగా మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన జరిగింది.

విదేశాలపై ఆధారపడటమే మన భవిష్యత్తుకు అతిపెద్ద శత్రువు.. ప్రధాని మోదీ.. చిప్స్ అయినా, షిప్స్ అయినా భారత్‌లోనే!

ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత ఇప్పుడు తుది ఫలితాల విడుదల మిగిలి ఉంది. 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా త్వరలోనే వెలువడనుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన సమయం. సంవత్సరాలుగా కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమైన వారికి ఈ ఫలితాలే భవిష్యత్‌ మార్గాన్ని నిర్ణయించనున్నాయి. టీఎస్‌పీఎస్సీ ఎప్పుడు అధికారికంగా ఫలితాలు విడుదల చేస్తుందో అనే అంశంపై అభ్యర్థులంతా ఉత్కంఠగా ఉన్నారు.

Amrit Bharat Express : ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ రైలు.. మొత్తం 12 స్టేషన్లలో.. ఎక్కడి నుంచి?

ఇక గ్రూప్‌ 3 నియామకాల విషయానికి వస్తే, మొత్తం 1,388 పోస్టుల కోసం 2024 నవంబరులో రాత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,67,921 మంది హాజరయ్యారు. సాంకేతిక కారణాల వల్ల 18,364 మందిని అనర్హులుగా ప్రకటించి, మిగిలిన 2,49,557 మందికి జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ను మార్చి 14న విడుదల చేశారు. జూన్‌లో ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉండగా, గ్రూప్‌ 2 ఫలితాలు ఆలస్యం కావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. గ్రూప్‌ 2 నియామకాలు పూర్తయిన వెంటనే గ్రూప్‌ 3 తుది ప్రక్రియ పూర్తి చేయాలని కమిషన్‌ నిర్ణయించుకుంది.

Work Rules: ఏపీలో కార్మిక చట్టాల్లో సంచలన మార్పులు..! ఓవర్‌టైమ్ కూడా రెట్టింపు..!
Aqua Farmers: AP ఆక్వా రైతులకు కీలక హెచ్చరిక..! వారికి ఒక్క రూపాయి రాయితీ కూడా లభించదు..!
Amaravati Updates: అమరావతికి పెరిగిన క్రేజ్.. కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. ప్రజల ఆశ! ప్రాపర్టీ షోలో సందడి!
EC: ఏపీలో ఆ పార్టీలకు ఈసీ షాక్..! రెండు నెలల్లోనే 808 పార్టీలు రద్దు..!
AP’s rich biodiversity: ఏపీ సముద్రాల్లో అద్భుతం.. పరిశోధకులకు కొత్త ఆశలు రేకెత్తించిన అరుదైన డాల్ఫిన్‌ల గుంపు.. ఇకపై తరచూ.!
Lemon Tips: నిమ్మకాయ ఎంత మంచిదైనా.. ఈ ఆహారాలతో కలిపి తింటే నేరుగా కైలాసానికే! ఎందుకంటే.!