LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: పెట్టుబడుల వేటలో ఏపీ... కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం!

Chandrababu: అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పెట్టుబడులు పెంచడంపై సమీక్షించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్లుగా ప్రకటించి అధికారులను నియమించారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: పెట్టుబడుల వేటలో ఏపీ... కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం!

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: జిల్లాల మధ్య పోటీ పెట్టనున్న ముఖ్యమంత్రి.

విశాఖ, అమరావతి, తిరుపతి ఇక ఆర్థిక హబ్‌లు.. ప్రత్యేక అధికారుల నియామకం…

పరిశ్రమలు వస్తేనే ఉపాధి.. కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా ఉండాలి: చంద్రబాబు…

Chandrababu: అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మరియు పెట్టుబడులపై కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడి ప్రతిపాదనలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, అవి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా (Grounding Projects) కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఏ జిల్లాల్లో అయితే పరిశ్రమలు వేగంగా స్థాపించబడతాయో, ఆ జిల్లాల కలెక్టర్ల పనితీరును మెచ్చుకుంటూ వారికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కింద ర్యాంకులు ఇస్తామని, అధికారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆయన సూచించారు.

పెట్టుబడులు రాబట్టడంలో కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా వ్యవహరించాలని, అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలకు అవసరమైన భూ కేటాయింపులు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రధాన ఆర్థిక మండలాలుగా (Economic Regions) తీర్చిదిద్దుతున్నామని, వీటికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక బాధ్యులుగా నియమించినట్లు ప్రకటించారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగడమే కాకుండా, ప్రజల తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని ఆయన వివరించారు.

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలను కూడా పారిపోయేలా చేశారని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. 2014-19 మధ్య పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్‌ను ఎలాగైతే అభివృద్ధి చేశామో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే తరహా అనుకూల వాతావరణాన్ని (Eco System) నిర్మించడమే తన లక్ష్యమని ఆయన కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంటుందని, కలెక్టర్లు ఆయా జిల్లాల అనుకూలతలను గుర్తించి పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని జిల్లాల్లో భారీ పరిశ్రమలు రాకపోతే, అక్కడ పర్యాటక రంగం (Tourism) లేదా ఐటీ, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ గా మారుతోందని, అలాగే కడప జిల్లాలోని కొప్పర్తి కూడా అతిపెద్ద పారిశ్రామిక క్లస్టర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి జిల్లాలో ఇన్వెస్టర్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించాలని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రులు, కలెక్టర్లు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో అభివృద్ధి సాధ్యమో ఆ రంగాన్ని కలెక్టర్లు ప్రమోట్ చేయాలని, అప్పుడే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన కృషితోనే హైదరాబాద్‌కు ఐఎస్బీ వంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఏపీని కూడా అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. అధికారులందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేశారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…