Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (Central University) తొలి దశ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 15 నెలల క్రితం ప్రారంభించిన ఈ నిర్మాణం తొలి దశకు రూ.350 కోట్ల ఖర్చుతో ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దారు. ఈ క్యాంపస్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు.

Free Smartphones: ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు! అర్హులు ఎవరంటే?

విభజన హామీలలో భాగంగా 2018లో కేంద్రం నుంచి రూ.711 కోట్ల నిధులు మంజూరు కావడంతో, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్సిటీ ఏర్పాటుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. తాత్కాలికంగా అనంతపురం జేఎన్టీయూ క్యాంపస్‌లో నాలుగు UG, రెండు PG కోర్సులతో తరగతులు ప్రారంభించారు. ఇప్పుడు శాశ్వత ప్రాంగణంలో తరగతి గదులు పూర్తికావడంతో విద్యార్థులను అక్కడకు తరలించారు. ప్రస్తుతం 9 UG కోర్సులు, 17 PG కోర్సులు, 6 PhD ప్రోగ్రామ్స్, 15 డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నారు.

Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్! ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు కట్!

విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా Skill Development Center ఏర్పాటు చేసింది. ఇందులో విద్యతో పాటు కుట్టు, చెఫ్ శిక్షణ, పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవసరమైన శిక్షణలు ఇస్తున్నారు. ఇది విద్యార్థుల కెరీర్‌కు అదనపు బలాన్ని అందిస్తోంది. ప్రస్తుతం 2,200 మందికి ప్రవేశాలు కల్పించి, హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!

రెండో దశ పనులకు ఇప్పటికే రూ.178 కోట్ల నిధులు కేటాయించగా, ఇది పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పడనుంది. ఇందులో మరిన్ని అకడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, అధ్యాపకుల నివాస గృహాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం 23 రాష్ట్రాల విద్యార్థులు ఈ వర్సిటీలో చదువుకుంటుండటం గర్వకారణం. డీన్ షీలా తెలిపారు ― “కంప్యూటర్స్ అన్నీ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌తో ఉన్నాయి. విద్యార్థుల అభ్యున్నతికి అవసరమైన ప్రతి చర్య మేము తీసుకుంటున్నాం.”

Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!
Danger Bells: డేంజర్ బెల్స్! ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న పెద్ద సమస్య! లక్షణాలు... జాగ్రత్తలు ఇవే!
Cyber Police: చంద్రబాబు పేరుతో దందా - ఫేక్ ప్రకటనలతో కలకలం.. సీఐడీ విచారణ ప్రారంభం!
TTD Donated: “సంతానం లేకపోయినా.. శ్రీవారు మా వారసుడు” – భక్తజంట ఉదాత్త నిర్ణయం! ఇల్లు మాత్రమే కాదు..
Elections: ఎన్నికల రంగంలోకి ఏపీ... జగన్ ఇలాఖాలో తీవ్ర సమర సన్నాహాలు!