ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ యోజన కింద ప్రతి ఇంటినీ సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలున్న నేపథ్యంలో వారి ద్వారా అంచెలంచెలుగా విస్తృత పరచాలని నిర్ణయించింది. తొలి విడతగా లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ఏర్పాటు వల్ల కలిగే లబ్ధిపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 80,000ల మంది సమ్మతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానళ్లు అమర్చగా వాటిలో 400 గృహాలు డ్వాక్రా మహిళలవే ఉన్నాయి. ఇతర జిల్లాల్లోనూ ప్యానళ్ల ఇన్స్టాలేషన్ ప్రారంభమైంది.
ఇంకా చదవండి: విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ అధిష్టానం! సంచలన వ్యాఖ్యలు!
కేటగిరీని బట్టి రాయితీ: పీఎం సూర్య ఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. దీని కింద 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫప్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూప్టాప్ ఏర్పాటు వ్యయం రూ.1.95 లక్షలు కాగా రాయితీ రూ.78,000లు వస్తుంది. రెండు కిలోవాట్లయితే రూ.1.40 లక్షలు కాగా రాయితీ రూ.60,000లు వర్తిస్తుంది. ఒక కిలోవాట్ వ్యయం రూ.70,000లు కాగా రూ.30,000ల రాయితీ లభిస్తుంది. PM Surya Ghar Yojana : లబ్దిదారులు వారి ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్ధ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారు వాటా 10 శాతం పోనూ, మిగతా మొత్తాన్ని 7 శాతం వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్దిదారు 10 శాతం వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మూడో మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా! 62 వేల గ్రూపుల సలహాలు, సూచనలు..
విజయసాయిరెడ్డి రాజీనామాపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! పార్టీ పరిస్థితి కూడా..
ఈ విషయంలో భారతీయుల గుండెల్లో గుబులు! అమెరికా వద్దంటే.. ఈ దేశాలు రారమ్మంటున్నాయ్.. ఆ వివరాలు..
రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త! వారి అకౌంట్లలోకి రూ.53 వేలు జమ!
ఎమ్మెల్యే పై టమాటాలు, గుడ్లు విసిరిన జనం.. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: