మహరాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. ముంబైలోని షిండే నివాసంలో వీరి సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన వర్గం భాగస్వామ్య పార్టీలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏక్ నాథ్ షిండేతో సుమారు 40 నిమిషాల పాటు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ఇంటికి వచ్చిన సీఎం చంద్రబాబు కు ఏక్ నాథ్ షిండే శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ ఆశీర్వాద్ కార్యక్రమం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఘనంగా ముగిసింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యారు. పీఎం మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
ఈ దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: