LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు.

AndhraPravasi News Desk 2 min read
Kollu Ravindra: స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్రలో ప్రజల భాగస్వామ్యం అవసరం.. మంత్రి కొల్లు రవీంద్ర!

ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో భాగస్వాములవుదాం..

మన పరిసరాలను రక్షించుకునే బాధ్యత ప్రజలంతా తీసుకోవాలి..

మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా మంత్రి జగన్నాథపురంలోని తన నివాసం నుంచి ఎలక్ట్రిక్ సైకిల్‌పై బయలుదేరి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు కూడా పాల్గొన్నారు. రైతు బజార్ వద్ద ప్రజలు, వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసి, వ్యాపారులతో సరదాగా ముచ్చటించారు.

మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని మంత్రి సూచించారు. ప్రజా రవాణా ఉపయోగిస్తున్న ప్రయాణికులను అభినందిస్తూ, ఇంధన పొదుపు కోసం ప్రతి ఒక్కరూ బస్సులు లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరారు. రైతు బజార్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా శుభ్రం చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పౌరులతో మంత్రి పరిశుభ్రత ప్రమాణం చేయించారు. “మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం” అని అందరూ సంకల్పం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. అందుకే ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. గతంలో “క్లీన్ అండ్ గ్రీన్” పేరుతో ప్రారంభమైన కార్యక్రమమే ఇప్పుడు మరింత విస్తృతంగా కొనసాగుతోందన్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఇప్పటికే నిషేధం అమల్లో ఉందని, దాన్ని కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. చెత్తను కేవలం తొలగించడం కాకుండా, తడి చెత్త – పొడి చెత్త వేరు చేసి ప్రాసెసింగ్ యూనిట్లకు పంపాలని చెప్పారు. చెత్తను సక్రమంగా ప్రాసెస్ చేస్తే ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.

రైతు బజార్ ప్రాంతాల్లో ప్లాస్టిక్, కూరగాయల వ్యర్థాలు, కొబ్బరి బొండాలు ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తున్నాయని హెచ్చరించారు. “ఎవరో వచ్చి శుభ్రం చేస్తారు” అని ఎదురు చూడకుండా ప్రతి ఇంటి నుంచే పరిశుభ్రత ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని మంత్రి సూచించారు. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి ప్రతి కుటుంబం ఒక మొక్క నాటేలా బాధ్యత తీసుకోవాలన్నారు. మొక్క నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. యువత, విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి పేరుతో ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, అదే స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

మున్సిపల్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని, అవసరమైతే ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కమిటీలు ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. వచ్చే ఆదివారం మంగినపూడి బీచ్‌లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి అక్కడి చెత్తను తొలగించనున్నట్లు తెలిపారు. “మంగినపూడి బీచ్ మన అందరి ఆస్తి.. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, విద్యాసాగర్, కన్వీనర్ సుశీల్, మరకాని పరబ్రహ్మం, అల్లూరి సోమశేఖర్, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే నాని తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా AI-171 ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు!

Ram Mohan Naidu: ఏర్ ఇండియా విమానం AI-171 ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శ…

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఇటీవల దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి.. తాజా దాడి పుకార్లతో ఒమన్ తీరంలో ఒక్కసారిగా ఉత్కంఠ!

Strait of Hormuz: ఒమన్‌ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందన్న వా…

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!

Supreme Court: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినే…