LIVE
Fuel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్... త్వరలోనే తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!  •  Prajavedhika: మాజీ మంత్రి బంధువుపై గ్రీవెన్స్‌లో భూ కబ్జా ఫిర్యాదు.... వెబ్‌ల్యాండ్ సాంకేతిక లోపాలతో దొంగ పాస్ పుస్తకాలు.... బాధితులకు మంత్రి నారాయణ భరోసా!  •  APNRT: ప్రవాసాంధ్రులకు సువర్ణావకాశం... విదేశాల్లో కనకదుర్గమ్మ ప్రత్యేక గృహ పూజల సదుపాయం!  •  ఆయుష్మాన్ భారత్ కార్డ్‌తో రూ. 5 లక్షల ఉచిత వైద్యం! పూర్తి వివరాలు...  •  AP Students: విద్యార్థులకు అలర్ట్... ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన!  •  Chandrababu: జూన్ 10, 11 తేదీల్లో దేశ రాజధానిలోనే బస.. 11వ తేదీ రాత్రికి..  •  తెరపైకి కొత్త డిమాండ్... మాకు ఎస్సీ హోదా కల్పించండి!!  •  AP Government: సామాన్యుడికి ఊరట.. ఏపీలో త్వరలోనే 1,000 మినీ మార్టుల ఏర్పాటు! ఎక్కడక్కడంటే...  •  New Airport: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్ట్... రూ.648 కోట్లతో నాలుగు జిల్లాలకు పండగే.. 2029నాటికి పూర్తి!  •  Gas Price Hike India: బిగ్ షాక్.. గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను సగానికి పైగా తగ్గించిన కేంద్రం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
National

Weather Update: ఏపీలో వరుణుడి బీభత్సం.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ పిడుగులు పడే ఛాన్స్!

Ap Weather Reports: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

AndhraPravasi News Desk 2 min read
Weather Update: ఏపీలో వరుణుడి బీభత్సం.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్  పిడుగులు పడే ఛాన్స్!

AP Weather Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్ని గంటలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని సూచించింది.

రాష్ట్రంలోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల  ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అల్లూరి సీతారామరాజు, కాకినాడ వంటి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం జిల్లా ప్రత్తిపాడులో ఈదురుగాలుల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. భారీ గాలుల వల్ల అనేక చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి రంపాలతో చెట్లను తొలగించి దారిని సుగమం చేశారు. విద్యుత్ తీగలు తెగిపడటంతో ముందు జాగ్రత్తగా అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
అకాల వర్షాల వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంట నీటిపాలవుతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ఈ వర్షం గండంగా మారింది. పొలాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అటు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ ఉండకూడదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణం అనుకూలించే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

Be the first to react

More Coverage

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పవన్ కళ్యాణ్.. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పవన్ కళ్యాణ్.. 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీకి శ్రీకారం!

Pawan Kalyan: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు…

Environment: పర్యావరణ పరిరక్షణలో భారత్‌ ముందంజ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రుల సందేశం!

Environment: పర్యావరణ పరిరక్షణలో భారత్‌ ముందంజ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రుల సందేశం!

Environment: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స…

Chandrababu: రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన.. సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొననున్న సీఎం!

Chandrababu: రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన.. సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొననున్న సీఎం!

Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యా…