LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే..

Tirumala Devotees: తిరుమలలో గత ఏడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య మరియు హుండీ ఆదాయం గణనీయంగా పెరిగాయి. దళారీ వ్యవస్థను అరికట్టడానికి ప్రవేశపెట్టిన 'దర్శనం ఉంటేనే గది' విధానం వల్ల భక్తులకు వసతి సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా పారదర్శకత పెరిగిందని టీటీడీ తెలిపింది.

AndhraPravasi News Desk 1 min read
Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన  తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే..

Devotional- వారి హుండీకి కాసుల వర్షం: ఈ ఏడాది రూ.1,420 కోట్ల ఆదాయం నమోదు…

గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థకు చెక్.. 'దర్శనం ఉంటేనే గది' విధానం సక్సెస్…

టీటీడీ చరిత్రలో నవశకం.. రోజుకు సగటున 73 వేల మందికి పైగా దర్శనాలు…

Tirumala Devotees: గత రెండేళ్లతో పోలిస్తే తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. 2025-26 సంవత్సరంలో ఏకంగా 2 కోట్ల 66 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 4.57 శాతం వృద్ధిని సూచిస్తోంది. గతంలో సగటున రోజుకు 70 వేల మంది దర్శనం చేసుకునేవారు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 73 వేలకు చేరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు కీలక మార్పులను చేపట్టింది.

ముఖ్యంగా తిరుమలలో గదుల కేటాయింపులో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీ కఠిన చర్యలు తీసుకుంది. గతంలో దర్శనంతో సంబంధం లేకుండా గదులు ఇచ్చేవారు, దీనిని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు గదులను బ్లాక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 'దర్శనం ఉంటేనే గది కేటాయింపు' అనే విధానాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల బ్లాక్ మార్కెట్ పూర్తిగా అగిపోయిందని, లడ్డు ప్రసాదం నాణ్యత మరియు రుచి కూడా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా గతేడాదితో పోలిస్తే 5.25 శాతం పెరిగింది. గత సంవత్సరం రూ.1,345 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రూ.1,420 కోట్లకు చేరింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూ లైన్ల నిర్వహణను పర్యవేక్షించడం, గదుల కేటాయింపులో పారదర్శకత తీసుకురావడం వంటి చర్యల వల్లే భక్తుల సంఖ్య మరియు ఆదాయం పెరిగిందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా టీటీడీ తన పాలనను కొనసాగిస్తోంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…