LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం!

Tirumala: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 83 వేల మందికి పైగా స్వామివారి దర్శనం!

శ్రీవారి దర్శనానికి భారీ క్యూలు.. 12 గంటల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి..

తిరుమలలో భక్తుల సందడి.. రూ.4.38 కోట్ల హుండీ ఆదాయం..

తిరుమల: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో రద్దీ కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల వ్యవధిలో దర్శనం లభిస్తోంది. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులు 4 నుంచి 6 గంటల సమయంలో శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.

నిన్న ఒక్కరోజే 83,858 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తిశ్రద్ధలతో 35,941 మంది తలనీలాలు సమర్పించారు.

శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలతో హుండీ ఆదాయం రూ.4.38 కోట్లకు చేరింది. అదే సమయంలో 4 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. అన్నప్రసాద వితరణ కేంద్రాల ద్వారా 2.17 లక్షల మంది భక్తులు ఉచిత భోజనాన్ని స్వీకరించారు.

తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత కోసం టీటీడీ చేపడుతున్న వైద్య సేవలను 3,331 మంది వినియోగించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, వైద్య సేవలు మరియు ఇతర సౌకర్యాలను టీటీడీ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు సహనంతో దర్శనానికి సహకరించాలని, టీటీడీ సూచనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…