LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 31 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు!

శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు..

ఒక్కరోజులో 75 వేల మందికి పైగా శ్రీవారి దర్శనం..

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారి దర్శనం కోసం సుమారు 18 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) టికెట్లు కలిగిన భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది.

అలాగే సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 4 నుంచి 6 గంటల వరకు నిరీక్షించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.

గురువారం స్వామివారిని మొత్తం 75,691 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,050 మంది భక్తులు తమ తలనీలాలను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లుగా నమోదైంది. భక్తులకు ప్రసాదంగా మొత్తం 4.08 లక్షల లడ్డూలను విక్రయించారు. అలాగే 2.53 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత భోజన సేవలను వినియోగించుకున్నారు.

భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ వైద్య సేవలను కూడా అందిస్తోంది. గురువారం ఒక్కరోజే 3,290 మంది భక్తులు తిరుమలలో వైద్య చికిత్స పొందినట్లు అధికారులు వెల్లడించారు.

వేసవి సెలవులు, వారాంతం సమీపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు వేచి ఉండే సమయాన్ని ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలని టీటీడీ సూచిస్తోంది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…