LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ!

Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింపు.. సర్వదర్శనానికి 24 గంటల నిరీక్షణ!

ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 24  గంటల సమయం..

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం..

తిరుమల: కలియుగ వైకుంఠమైన తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో తిరుమలలోని అన్ని వైకుంఠం క్యూ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్ కలిగిన భక్తులకు కూడా 4 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం 6 నుంచి 8 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేపట్టి, తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు అందుబాటులో ఉంచింది.

నిన్న ఒక్కరోజే స్వామివారిని మొత్తం 67,722 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 36,705 మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. మరోవైపు స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లకు చేరినట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమలకు వచ్చే వారు ముందస్తుగా దర్శన సమయాలను తెలుసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…