LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లలో భక్తులు!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం విడుదలైన తాజా సమాచారం ప్రకారం, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గత కొన్ని రోజుల కంటే కొంత తక్కువగా కనిపిస్తున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనం కోసం 07 కంపార్ట్ మెంట్లలో భక్తులు!

సర్వదర్శనం భక్తులకు 06-08 గంటల సమయం..

300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం విడుదలైన తాజా సమాచారం ప్రకారం, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గత కొన్ని రోజుల కంటే కొంత తక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 6 నుంచి 8 గంటల వరకు సమయం పడుతోంది.

అదే విధంగా రూ.300 ప్రత్యేక శీఘ్రదర్శనం టికెట్‌ ద్వారా వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల వ్యవధిలో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం (SSD) టోకెన్లు పొందిన భక్తులకు 3 నుంచి 5 గంటల మధ్యలో దర్శనం పూర్తవుతోంది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 85,942 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 29,238 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది.

భక్తుల రద్దీ తగ్గినా, తిరుమలలో భక్తిశ్రద్ధలతో సందడి కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు “ఓం నమో వేంకటేశాయ” నామస్మరణతో స్వామివారి దర్శనం పొందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…