LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి

Everest: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

AndhraPravasi News Desk 1 min read
Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి

ఎవరెస్టు దిగివస్తూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి..

హిందూపురం యువకుడు సందీప్ ఆరే ఎవరెస్టు యాత్రలో మృతి..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో ఇద్దరు భారతీయ పర్వతారోహకులు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ప్రాంతానికి చెందిన సందీప్ ఆరేగా గుర్తించగా, మరొకరు హైదరాబాద్‌లో స్థిరపడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణ్ కుమార్ తివారీగా అధికారులు తెలిపారు.

సందీప్ ఆరే అమెరికాలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్నట్లు సమాచారం. పర్వతారోహణపై అతనికి చిన్ననాటి నుంచే ఆసక్తి ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మే 20న ఆయన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. అయితే మరుసటి రోజు తిరిగి దిగివస్తున్న సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు సమాచారం. గతంలో కిలిమంజారో సహా పలు అంతర్జాతీయ శిఖరాలను కూడా సందీప్ అధిరోహించిన అనుభవం ఉన్నట్లు తెలిసింది.

ఇక అరుణ్ కుమార్ తివారీ హైదరాబాద్‌లో నివసిస్తూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. ఉద్యోగంతో పాటు పర్వతారోహణను అభిరుచిగా మార్చుకుని ఎన్నో శిఖరాలను అధిరోహించారు. రష్యా, అమెరికా, అర్జెంటీనాలోని పర్వతాలను విజయవంతంగా ఎక్కిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఎవరెస్టు నుంచి దిగివస్తున్న సమయంలో తీవ్ర అలసట, అధిక ఎత్తు ప్రభావం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇద్దరినీ రక్షించేందుకు గైడ్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయినట్లు సమాచారం. ప్రస్తుతం మృతదేహాలను దిగువకు తీసుకురావడానికి ప్రత్యేక బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎవరెస్టు వంటి సాహస యాత్రలు ఎంత గొప్పవో, అంతే ప్రమాదకరమని మరోసారి ఈ ఘటన గుర్తు చేసింది.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…