LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స!

Ebola: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Ebola: హైదరాబాద్‌లో ఎబోలా అలర్ట్.. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు అనుమానితులకు చికిత్స!

ఎబోలా లక్షణాలతో ఇద్దరు సూడాన్ పౌరులకు చికిత్స..

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో అనుమానితుల పర్యవేక్షణ..

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఇద్దరు ఎబోలా అనుమానితులకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

వైద్యుల వివరాల ప్రకారం, సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ యగౌచ్ అనే వ్యక్తి ఎబోలా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఇదే సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో అహ్మద్ అనే మరో సూడాన్ పౌరుడికి కూడా ఎబోలా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ ఇద్దరూ ఇటీవల సూడాన్ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. దీంతో వైద్య శాఖ మరింత అప్రమత్తమై, వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచింది.

అనుమానితుల నుంచి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని పరీక్షల కోసం ముందుగా హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపించారు. అక్కడి నుంచి తుది నిర్ధారణ కోసం పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ (National Institute of Virology) ప్రయోగశాలకు తరలించారు. పరీక్షల నివేదికలు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అలాగే ఎబోలా లక్షణాలతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తిని కూడా గుర్తించి, గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశారు. వైద్య నిపుణుల బృందం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

అయితే ప్రస్తుతం ఎబోలా వైరస్ నిర్ధారణ కాలేదని, కేవలం అనుమానిత కేసులుగా మాత్రమే వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎబోలా వైరస్‌కు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

Be the first to react

More Coverage