LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Disease Prevention: ఏప్రిల్ 8 వరకు చికెన్, మటన్ షాపులు క్లోజ్ – మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు..!

Nandigama News: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో డయేరియా వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. చందాపురంలో వ్యాధి తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 8 వరకు పట్టణంలోని చికెన్, మటన్, చేపల విక్రయాలతో పాటు హోటళ్లలో మాంసం వంటకాలను పూర్తిగా నిషేధిస్తూ కమిషనర్ లోవరాజ…

AndhraPravasi News Desk 1 min read
Disease Prevention: ఏప్రిల్ 8 వరకు చికెన్, మటన్ షాపులు క్లోజ్ – మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు..!

Nandigama News: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మాంసం ప్రియులకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. స్థానికంగా డయేరియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజుల పాటు మాంసం విక్రయాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చందాపురం ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ కఠిన చర్యలు చేపట్టాల్సి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.

నందిగామ మున్సిపల్ పరిధిలోని చందాపురంలో గత కొన్ని రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు వల్ల ఈ వ్యాధి మరింత ప్రబలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ లోవరాజు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని అన్ని చికెన్ సెంటర్లు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు ఏప్రిల్ 8వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశించారు.

కేవలం  మాంసం విక్రయాలకే కాకుండా, హోటళ్లు  రోడ్డు పక్కన ఉండే కర్రీ పాయింట్లపై కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని కమిషనర్ స్పష్టం చేశారు. హోటళ్లలో నాన్-వెజ్ వంటకాలు వండరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి దొంగచాటుగా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా చికెన్, మేక, గొర్రె  చేపల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని వ్యాపారులకు సూచించారు.

పట్టణ ప్రజల ప్రాణరక్షణే తమకు ముఖ్యమని, డయేరియాను అరికట్టడానికి ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రజలు కూడా బయట దొరికే మాంసం వంటకాలకు దూరంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే చందాపురంతో పాటు మిగిలిన వార్డుల్లో బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ చేయడం వంటి పనులు వేగవంతం చేశారు.

ఈ నిషేధం ఏప్రిల్ 8 వరకు అమల్లో ఉంటుందని, అప్పటివరకు మాంసం వ్యాపారులు తమ దుకాణాలను తెరువకూడదని మున్సిపల్ యంత్రాంగం మరోసారి స్పష్టం చేసింది. అధికారుల ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయని, నిబంధనలు మీరితే జరిమానాలతో పాటు షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని మున్సిపల్ కమిషనర్ లోవరాజు హెచ్చరించారు.

Be the first to react

More Coverage