LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Health

Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా!

Ebola: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

AndhraPravasi News Desk 1 min read
Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా!

ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. కట్టుదిట్టమైన నిఘా చర్యలు..

బెంగళూరులో అనుమానితుడికి ఎబోలా నెగటివ్.. ఊపిరి పీల్చుకున్న అధికారులు..

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది.

ఇటీవల ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ వ్యక్తికి స్వల్పంగా ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపించడంతో అతడిని బెంగళూరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కు పంపగా, పరీక్షల్లో ఎబోలా వైరస్ లేదని తేలింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎబోలా పరిస్థితిని కేంద్ర ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్య చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్జాతీయ విమానాశ్రయాలు సహా దేశంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక స్క్రీనింగ్, నిఘా చర్యలు కొనసాగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపింది.

అఫవాహాలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య సమాచారాన్ని పంచుకోవద్దని సూచించింది. పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా నియంత్రణలో ఉంచిందని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ భరోసా ఇచ్చింది.

Be the first to react

More Coverage