LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Amaravathi: టిడిపి ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో.. ఘనంగా అమరావతి రాజధాని వేడుకలు!

Amaravathi: మరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, టిడిపి కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Amaravathi: టిడిపి ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో.. ఘనంగా అమరావతి రాజధాని వేడుకలు!

ఖతార్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని వేడుకలు.. 

టిడిపి ఖతార్ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖతార్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, టిడిపి కార్యకర్తలు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొన్నారు.  

టిడిపి ఎన్‌ఆర్‌ఐ ఖతార్ అధ్యక్షుడు గోటిపాటి రామనయ్య, మాదినేని అంజనేయులు, యెలమంచలి శాంతయ్య, దేవినేని శ్రీనివాస్, దాసరి రమేష్, మాగులూరి రవీంద్ర, గాలి కవీంద్ర, అనిల్ మలసాని, నార్నే కళ్యాణ్, రావుల శేషసాయి, షేక్ మహ్మద్ యాసిన్, బొండలపాటి విజయ్, వేణు బాల, గోపాల్ చౌదరి, ఇదుపుగంటి వాసు, హను, కిరణ్, మాలి రెడ్డి సత్యనారాయణ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో, దేశభక్తి నినాదాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమని, భవిష్యత్తులో రాష్ట్రానికి అభివృద్ధి దిశగా దోహదపడుతుందని పాల్గొన్నవారు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

విదేశాల్లో ఉన్నా మన రాష్ట్ర అభివృద్ధి పట్ల తమకున్న బాధ్యతను మరవకూడదని, అమరావతి నిర్మాణానికి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కుటుంబాలతో కలిసి నిర్వహించిన ఈ భారీ సమావేశం ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. మహిళలు, యువత, చిన్నారులు సైతం చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని మరింత రంగరించారు.

వేడుకలలో భాగంగా జెండా ఆవిష్కరణ, కేక్ కట్టింగ్, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ భారీ సమాహారం ఖతార్‌లోని తెలుగు సమాజ ఐక్యతను ప్రతిబింబించింది. అమరావతి రాజధాని కోసం తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పాల్గొన్నవారు స్పష్టం చేశారు.

కార్యక్రమం చివరలో నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలు ప్రతి ఒక్కరిలో గర్వాన్ని, ఐక్యతను పెంచాయని అన్నారు.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…