TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! AP Health Department: సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష!! IT jobs: డిసెంబర్ డ్రై మంత్‌కు గుడ్‌బై.. జనవరిలో ఐటీ ఉద్యోగ జాతర! Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!! Lokesh: విజన్ లేకుంటే అభివృద్ధి లేదు..! ఎగతాళి చేసే వాళ్లపై నారా లోకేష్ ఫైర్..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు! TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! AP Health Department: సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష!! IT jobs: డిసెంబర్ డ్రై మంత్‌కు గుడ్‌బై.. జనవరిలో ఐటీ ఉద్యోగ జాతర! Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!! Lokesh: విజన్ లేకుంటే అభివృద్ధి లేదు..! ఎగతాళి చేసే వాళ్లపై నారా లోకేష్ ఫైర్..! Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..! World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!! Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు!

Praja Darbar: విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్‌ ప్రజల సమస్యలకు భరోసా!!

2025-12-16 15:04:00
Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన!

విశాఖపట్నంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ విశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం 78వ రోజుకు చేరుకోవడం గమనార్హం. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, బాధలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరిగా వారి వినతులను శ్రద్ధగా విన్న మంత్రి, తగిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి...

ఈ ప్రజాదర్బార్‌లో విశాఖపట్నం కంచరపాలెం ప్రాంతానికి చెందిన లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి తన సమస్యను మంత్రి లోకేష్‌కు వివరించారు. తాను ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందినప్పటికీ, రిటైర్మెంట్‌కు సంబంధించిన బెనిఫిట్స్ ఇంకా పూర్తిగా అందలేదని వాపోయారు. ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించేలా చూస్తామని తెలిపారు.

Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం గుత్తైనదీవికి చెందిన గాలి దుర్గమ్మ తన భూమి సమస్యను వినిపించారు. తనకు చెందిన 20 సెంట్ల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మంత్రి, పూర్తిగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..!

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు కూడా మంత్రి లోకేష్‌ను కలిసి తమ గోడును వినిపించారు. 2008లో వీసీఐసీ ఫేజ్-1లో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ భూసేకరణ చేసినప్పటికీ, ఇప్పటికీ పునరావాసం కల్పించలేదని వారు వాపోయారు. ఏళ్లు గడుస్తున్నా తమ సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, భూ నిర్వాసితుల సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చూపుతుందని అన్నారు.

Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం!

అలాగే విశాఖ ఏపీహెచ్‌బీ లేఅవుట్‌కు చెందిన ఎస్. వెంకట లావణ్య తన ఫ్లాట్‌కు సంబంధించిన సమస్యను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమ 70వ నెంబర్ ఫ్లాట్‌ను అక్రమంగా ఆక్రమించారని, న్యాయం జరగాలని కోరారు. ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి!

మొత్తంగా ప్రజాదర్బార్‌లో వచ్చిన ప్రతి వినతిని శ్రద్ధగా నమోదు చేసుకున్న మంత్రి నారా లోకేష్, ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెంచేలా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు!
World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!!
Tata Sierra SUV: రూ.11.49 లక్షల నుంచే ప్రీమియం SUV..! బుకింగ్‌లు ఓపెన్, డెలివరీలు త్వరలో..!
Lokesh: విజన్ లేకుంటే అభివృద్ధి లేదు..! ఎగతాళి చేసే వాళ్లపై నారా లోకేష్ ఫైర్..!
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!

Spotlight

Read More →