World News: బోండి బీచ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాద దాడేనని స్పష్టం చేసిన ప్రధాని!!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ ఇటీవలే రక్తంతో సెలయేర్లుగా పారింది. హనుక్కా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజల

Published : 2025-12-16 13:47:00
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం!

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం బోండి బీచ్ ఇటీవలే రక్తంతో సెలయేర్లుగా పారింది. హనుక్కా పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్న సమయంలో జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దాడిలో మొత్తం 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!

ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోండి బీచ్‌లో జరిగిన ఈ కాల్పులు  ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద భావజాలమే ప్రేరణగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆమె స్పష్టం చేశారు. దాడికి పాల్పడినవారు తండ్రి, కుమారుడని వారి వయసులు వరుసగా 50 మరియు 24 సంవత్సరాలని పోలీసులు తెలిపారు. కాల్పుల సమయంలో తండ్రిని భద్రతా బలగాలు అక్కడికక్కడే కాల్చి చంపగా కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!

ఈ దాడికి సంబంధించి అనుమానితుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించిన జెండాలు లభించినట్లు తెలిపారు. ఈ ఆధారాల నేపథ్యంలోనే దాడి వెనుక ఉగ్రవాద ఆలోచనలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీజ్ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఇలాంటి అంశాలపై ప్రభుత్వం జాగ్రత్తగా స్పందించిందని, కానీ దృఢమైన ఆధారాలు లభించిన తర్వాతే ప్రజలతో వివరాలు పంచుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

బోండి బీచ్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా ఆషెస్ టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియాలు, బహిరంగ ప్రదేశాల్లో పోలీసుల సంఖ్యను భారీగా పెంచారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు, ఈ దాడిని అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రపంచ నాయకులు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి...

ఈ ఘటన ఆస్ట్రేలియాలో గన్ నియంత్రణ చట్టాలపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చింది. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోండి బీచ్‌లో జరిగిన ఈ దారుణం ఉగ్రవాదం ఎంత ప్రమాదకరమో మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.

Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన!
BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..!
Mehreen: త్వరలో పెళ్లి చేసుకుంటున్నానన్న వార్తలు ఫేక్.. మెహ్రీన్ స్పష్టం!
Flash floods: మొరాకోలో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం.. 37 మంది మృతి!
Maoist Movement: కుదేలవుతున్న మావోయిస్టు ఉద్యమం..! లీకైన సంచలన వాస్తవాలు!

Spotlight

Read More →