Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Snakes Revenge: పాములు పగ పడతాయా? 99 శాతం మందికి తెలియని నిజం! Weather Update: నిప్పుల కొలిమిలా అకోలా.. 46.9 డిగ్రీలతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.! రానున్న రోజుల్లో.. Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్... ఏప్రిల్ 28, 29 తేదీల్లో పిడుగులతో కూడిన వర్షాలు! Monster Tree: నేలతల్లికి శాపంగా మారిన రాక్షసి చెట్టు.... హై కోర్టు కీలక తీర్పు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Weather Update: ఏపీ ప్రజలకు అలర్ట్: రేపు 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. అప్రమత్తంగా ఉండండి! Full rains: గంట వాన.. 50 చెట్లు నేలమట్టం! బెంగళూరులో వాన బీభత్సం.. ఏడుగురి మృతి.. Snakes Revenge: పాములు పగ పడతాయా? 99 శాతం మందికి తెలియని నిజం! Weather Update: నిప్పుల కొలిమిలా అకోలా.. 46.9 డిగ్రీలతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.! రానున్న రోజుల్లో.. Weather Report: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్... ఏప్రిల్ 28, 29 తేదీల్లో పిడుగులతో కూడిన వర్షాలు! Monster Tree: నేలతల్లికి శాపంగా మారిన రాక్షసి చెట్టు.... హై కోర్టు కీలక తీర్పు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్!

Forest Roads: ఆ అటవీ మార్గాల్లో ప్రాణాలకు ముప్పు.. కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి పవన్ కళ్యాణ్!!

రాష్ట్రంలో అటవీ మార్గాల్లో జరుగుతున్న వన్యప్రాణుల ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్ అ

Published : 2025-12-24 08:30:00
Akhanda 2: బాక్సాఫీస్ వద్ద బాలయ్య శివతాండవం.. తగ్గని క్రేజ్… ఇంకా పెరిగే వసూళ్లకు ఛాన్స్!

రాష్ట్రంలో అటవీ మార్గాల్లో జరుగుతున్న వన్యప్రాణుల ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి  పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవల ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రెండు ఘటనలపై తక్షణమే విచారణ చేపట్టి పూర్తి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణ పర్యావరణ సమతులతకు కీలకమని ఈ విషయంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలంతా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

50 వేల మంది టెక్ విద్యార్థులకు క్వాంటం నైపుణ్యాలపై శిక్షణకు లక్ష్యం! ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో..

మంగళవారం ప్రకాశం జిల్లా మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని ఒక ఆడ పులి మృతి చెందడం, అలాగే ఆదోని రేంజ్ పరిధిలో రైలు ఢీకొని చిరుత మరణించడం తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరిగాయని భావించి వదిలేయరాదని, వీటికి గల కారణాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. అటవీ మార్గాల సమీపంలో రహదారులు, రైల్వే లైన్లు ఉండటం వల్ల వన్యప్రాణులకు పెరుగుతున్న ముప్పుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

Vijayawada Meet the Press: పెట్టుబడులను తరిమేశారు.. రాష్ట్రాన్ని ముంచేశారు విజయవాడ వేదికగా మంత్రి పార్థసారథి ఫైర్!!

ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అటువంటి హాట్ స్పాట్‌లలో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రంబుల్ స్ట్రిప్స్, బ్యారికేడ్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై రాత్రి వేళల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జనవరి 22 నుంచి ఫైనల్స్.. రెండు విభాగాల్లో పోటీలు!

వాహనదారులు నిబంధనలు పాటించని పరిస్థితుల్లో ప్రమాదాలు తప్పవని ఆయన హెచ్చరించారు. అందుకే స్పీడ్ గన్లు, ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వేగ పరిమితులను కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. పరిమితికి మించి వేగంతో ప్రయాణించే వాహనాలపై జరిమానాలు విధించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి సమయాల్లో అటవీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని, పోలీస్ శాఖ, రహదారి అథారిటీ, రైల్వే శాఖలతో సమన్వయం పెంచాలని అన్నారు.

సమంత 'మా ఇంటి బంగారం'.. చీరకట్టులో అదిరిపోయే యాక్షన్ స్టంట్స్! డూప్ లేకుండా..

వన్యప్రాణుల సంచార మార్గాలు అడ్డంకులు లేకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అయితే ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అటవీ మార్గాల్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, జంతువులు కనిపించిన వెంటనే వాహనాల వేగం తగ్గించి జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు. స్థానిక ప్రజలు, వాహనదారులలో వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని కూడా అధికారులను ఆదేశించారు.

CM Chandrababu: త్వరలో ఏర్పాటు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఆ జిల్లాల్లో..

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సమిష్టి ప్రయత్నాలు అవసరమని, వన్యప్రాణుల సంరక్షణ మన భవిష్యత్ తరాలకు ఇచ్చే ముఖ్యమైన వారసత్వమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అడవులు సురక్షితంగా ఉంటేనే పర్యావరణం సమతులంగా ఉంటుందని, ఆ సమతులతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఆయన తెలిపారు.

Risk of cancer: ఈ అలవాట్లు క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయా.. నిపుణుల హెచ్చరిక!
Free Bikes: ఏపీలో వారందరికీ ఉచితంగా బైకులు... ఇచ్చేది అప్పుడే! పత్రాలు రెడీ చేసుకోండి!
Praja Vedika: నేడు (24/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.33 కట్టక్కర్లేదు... ఆదేశాలు జారీ!

Spotlight

Read More →