AP Medical: విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! కొత్త 5 మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు…! Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..! Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ! SSC Marks: పదో తరగతి పరీక్షలకు భారీ మార్పులు! ఉపాధ్యాయుల గ్రేడింగ్‌పై కొత్త రూల్స్..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!! 2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా? AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!! AP Medical: విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! కొత్త 5 మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు…! Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..! Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ! SSC Marks: పదో తరగతి పరీక్షలకు భారీ మార్పులు! ఉపాధ్యాయుల గ్రేడింగ్‌పై కొత్త రూల్స్..! Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!! స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి! Storm effect : తుఫాన్ ఎఫెక్ట్.. రేపు తిరుపతి జిల్లాలో అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు! IIM Bangalore:ఇంటర్మీడియట్ తర్వాతే IIM బెంగళూరులో చదువు అవకాశం… అండర్‌గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కొత్త మార్గం!! 2026 Holidays: వచ్చే ఏడాది పండుగల సెలవుల లిస్ట్… ఇన్ని సెలవులా? AP Education: ఏపీ విద్యార్థినుల కోసం లోకేష్ మరో కీలక నిర్ణయం.. ఆ పథకానికి గ్రీన్ సిగ్నల్!!

Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..!

2025-12-04 13:01:00
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మన శంకరవర ప్రసాద్' నుంచి మరో పాట రెడీ! ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా..

ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా అనేక మంది పిల్లలు, యువతీయువకులు చదువుకు దూరమవ్వాల్సి వస్తోంది. చదవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులవల్ల చదువు మధ్యలో ముగించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ఆశాజనకమైన అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చదువును మానేసిన వారు తిరిగి విద్యలో చేరేందుకు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ద్వారా ఓపెన్‌ స్కూల్ పద్ధతిలో నేరుగా పదో తరగతి, ఇంటర్‌లో చేరే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 15తో దరఖాస్తులకు గడువు ముగిసిపోయినా, భారీ స్పందన రావడంతో ప్రభుత్వం రూ.600 లేట్‌ ఫీజుతో గడువును డిసెంబర్ 6 వరకు పొడగించింది. తిరిగి చదువుకోవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం.

AP Investments: సీఎం చంద్రబాబు విజన్ అసాధారణం… ఏపీ అభివృద్ధిపై అదానీ సంచలన వ్యాఖ్యలు!!

ఓపెన్‌ స్కూల్‌ ద్వారా నేరుగా 10వ తరగతిలో చేరాలనుకునేవారు 14 ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. అలాగే చదవడం, రాయడం వచ్చి ఉండటం తప్పనిసరి. వారు ఎంచుకున్న సబ్జెక్టుల్లో సెలవు రోజుల్లో శిక్షణ పొందుతూ పరీక్షలకు హాజరుకావచ్చు. ఇప్పటికే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్‌లో చేరకుండా ఆగిపోయిన వారు, లేదా ఇంటర్‌లో చేరి మధ్యలో వదిలేసిన వారు నేరుగా ఇంటర్‌లో చేరే అవకాశం పొందవచ్చు. ఇంటర్‌లో చేరేందుకు కనీస అర్హత 15 ఏళ్లు పూర్తై ఉండటం. విద్యార్థులు తమకు కావాల్సిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు. సెలవు రోజుల్లో జరిగే తరగతులకు హాజరై పరీక్షలు రాయవచ్చు.

Russia-India: వారణాసిలో పుతిన్ ఫోటోకు హారతి.. రష్యా భారత్ మైత్రికి ప్రజల హర్షం!

ఇంతేకాకుండా గతంలో పదో తరగతి లేదా ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ప్రభుత్వం పెద్ద అవకాశం కల్పించింది. వారు పాస్ అయిన రెండు సబ్జెక్టుల మార్కులను ఓపెన్ స్కూల్‌కు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. గతేడాది పదో తరగతి పరీక్షల్లో ఒకే సబ్జెక్టులో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆ సబ్జెక్టును మాత్రమే తిరిగి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా విద్యార్థులకు పరీక్షల భారం తగ్గించడంతో పాటు తిరిగి చదువులోకి రప్పించడమే సార్వత్రిక విద్యాపీఠం లక్ష్యం. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులు అనేక మందికి విద్యాభ్యాసం పునఃప్రారంభించే సౌకర్యం కల్పిస్తున్నాయి.

ఇండిగో విమానాలకు కష్టాలు.. వరుసగా మూడో రోజు భారీగా సర్వీసుల రద్దు! ఢిల్లీ, హైదరాబాద్‌లో..

ఓపెన్ స్కూల్‌లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, సులభంగా అర్థమయ్యే స్వీయ అభ్యసన పుస్తకాలు పంపిణీ చేస్తోంది. అలాగే జ్ఞానధార యూట్యూబ్ ఛానల్, అధికారిక ఓపెన్ స్కూల్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్ పాఠాలు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంటాయి. APOSS ఇచ్చే సర్టిఫికెట్లు దేశంలోని ఏ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు పొందుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులకు ఎంట్రీ ఫీజులో రాయితీలు కూడా లభిస్తాయి. చదువు మధ్యలో ఆగిపోయిన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పది రోజుల పాటు భక్తులకు - రేపు ఆన్‌లైన్‌లో.!
Golden Opportunity: వారందరికీ ఏపీ ప్రభుత్వ సువర్ణావకాశం! నేరుగా పది, ఇంటర్‌లో జాయిన్.. అదే లాస్ట్ డేట్!
Karnataka politics: కుర్చీ వివాదం తరువాత వాచ్ వివాదం.. కర్ణాటక రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్!
Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ 2వ విడత ప్రారంభం.. ఏ గ్రామం నుంచి ఎంత భూమి!
Farmers: అన్నదాతలకు అదిరే ఆఫర్..! పశువుల షెడ్లకు ప్రభుత్వం భారీ రాయితీలు!
IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!

Spotlight

Read More →