Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! Iphone Offers: రూ.లక్షా 34వేల ఐఫోన్ జస్ట్ రూ.10వేలకే.. కానీ ట్విస్ట్ ఏంటంటే!

IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!

 తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ మరో కీలకమైన నిర్ణయానికి దిగింది. పలు సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తున్న తమ జాతీయ విమానయాన సంస్థ ‘పాక

Published : 2025-12-04 10:16:00
Vandebharath: ఏపీలోని ఆ రూట్‌లో కొత్త వందేభారత్! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు...!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ మరో కీలకమైన నిర్ణయానికి దిగింది. పలు సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తున్న తమ జాతీయ విమానయాన సంస్థ ‘పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్’ (పీఐఏ)ను పూర్తిగా లేదా భాగం మేరకు అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి అత్యవసర ఆర్థిక సహాయం పొందేందుకు పీఐఏ ప్రైవేటీకరణ ఒక ప్రధాన షరతు. ఈ నేపథ్యంలో వచ్చే 23వ తేదీన పీఐఏలో 51 శాతం నుంచి 100 శాతం వాటాల విక్రయానికి బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. పారదర్శకత కోసం ఈ బిడ్డింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.

ప్రపంచంలోనే అతి పొడవైన అండర్‌వాటర్ రైలు మార్గానికి సన్నాహాలు! రెండు ఖండాలను కలిపే ప్లాన్.. ఎక్కడో తెలుసా ?

తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ ప్రైవేటీకరణ పాకిస్థాన్ చరిత్రలో గత రెండు దశాబ్దాల్లో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా భావిస్తున్నారు. బిడ్డింగ్ ప్రక్రియకు నాలుగు ప్రముఖ సంస్థలు అర్హత సాధించాయి. వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్షియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్షియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్‌తో పాటు పాక్ ఆర్మీ ఆధీనంలోని ‘ఫౌజీ ఫౌండేషన్’ కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉన్నాయి. పీఐఏను సైన్యం నియంత్రణలో ఉండే సంస్థ కొనుగోలు చేసే అవకాశాలు ఉండటం ప్రస్తుతం ఎక్కువ చర్చలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌లో ఆర్మీ ప్రభావం మరింత పెరుగుతుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా?

పీఐఏ దుస్థితికి కార‌ణాల గురించి చూస్తే, సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ జోక్యం, అనర్హుల నియామకాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. 2020లో సంస్థపై పెద్ద మచ్చ పడింది. సుమారు 30 శాతం పైలట్లు నకిలీ లైసెన్సులతో పనిచేస్తున్నారని బయటపడటంతో అంతర్జాతీయస్థాయిలో పీఐఏ ప్రతిష్ఠ ఒక్కసారిగా పడిపోయింది. దాని ప్రభావంతో యూరప్, యుకే, అమెరికా వంటి దేశాలు పీఐఏ విమానాలకు నిషేధం విధించాయి. ఈ నిషేధాలు సంస్థ ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థకు ఈ నిర్ణయం మరింత తీవ్రమైన దెబ్బ అయింది.

H-1B Visa: H-1B వీసా కొత్త నియమాలు … భారత ఐటీ రంగానికి భారమవుతుందా?

ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్న పీఐఏను నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. రోజురోజుకీ అప్పులు పెరుగుతుండటంతో అప్పులపై వడ్డీలు కట్టేందుకే మళ్లీ కొత్త అప్పులు తీసుకునే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా కుప్పకూలుతున్న దేశాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం ఐఎంఎఫ్ షరతులకు లోబడినట్లు స్పష్టమవుతోంది. IMF నుంచి 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పొందడానికి పీఐఏ ప్రైవేటీకరణ తప్పనిసరి కావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గౌరవం కల్గిన సంస్థను అమ్మకానికి పెట్టడం పాక్ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ ఒత్తిళ్లు మరియు ఆర్థిక వాస్తవాలు ఈ నిర్ణయం తప్పని స్థితిని తీసుకువచ్చాయి.

Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ!
India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!!
Bhavanipuram: విజయవాడ భవానీపురంలో హైటెన్షన్! వాటిపై సుప్రీంకోర్టు స్టే
Andhra Pradesh: ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్రం! రూ.125 కోట్లు నిధులు విడుదల..
Market News: సీతారామన్ వ్యాఖ్యలతో టోబాకో షేర్లలో చురుకుదనం!!
Putin India Visit: భారత్ పర్యటనకు పుతిన్.. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రతపై కీలక చర్చలు!!

Spotlight

Read More →