అమెరికాలోని హిందూ ఆలయాలపై వరస దాడులు... భారత్ కు వ్యతిరేకంగా రాతలు
కాలిఫోర్నియా హేవార్డ్లోని హిందూ ఆలయంపై దాడి జరిగింది. స్థానిక దుర్గాదేవి ఆలయంపై కొందరు దుండగులు.. ఖలిస్థానీకి మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్) 'ఎక్స్'లో పేర్కొంది.
బే ఏరియాలోని మరో హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతు రాతలు రాశారు. 6 హేవార్డ్లోని ది విజయస్ షేరావలి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం స్వామి నారాయణ్ ఆలయంపై దాడి, వారం క్రితం శివదుర్గ్ ఆలయంలో దొంగతనం తర్వాత ఇప్పుడీ ఘటన చోటు చేసుకొంది. ఆలయ పెద్దలతో, స్థానిక పోలీసులతో హెచ్ఎఎఫ్ టచ్లో ఉంది అని పేర్కొంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఖలిస్థానీల నుంచి ముప్పు పెరుగుతుండటంతో సెక్యూరిటీ కెమెరాలు, అలారమ్ బెల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హెచ్ఎఎఫ్ పేర్కొంది. అమెరికాలోని ఆలయ పెద్దలు హిందూ అమెరికన్ టెంపుల్ సేఫ్టీ గైడ్ను చూడాలని సూచించింది.
అక్టోబర్ లో కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరం పార్క్ వే ప్రాంతంలో ఉన్న ఓం రాధా కృష్ణా మందిరంలో హుండీ చోరీకి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి