Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం! Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తజనం.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Srisailam: శ్రీశైలం వెళ్తున్నారా... అప్పటి వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! Char Dham: ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్.. చార్‌ధామ్ యాత్రికులకు హెచ్చరిక! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా..

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.

Published : 2026-05-30 09:38:00

తిరుమలలో అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్.. శిలాతోరణం వరకు భక్తుల క్యూ..

ఒక్కరోజులో 78 వేల మందికి పైగా స్వామివారి దర్శనం..

తిరుమలలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతం కలిసి రావడంతో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. శనివారం ఉదయం నాటికి ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోందని వెల్లడించారు. మరోవైపు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) కోసం వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు కూడా 4 నుంచి 6 గంటల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, కుటుంబాలతో కలిసి వచ్చిన భక్తులు “గోవిందా… గోవిందా…” నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగిస్తున్నారు. టీటీడీ విడుదల చేసిన వివరాల ప్రకారం, శుక్రవారం ఒక్కరోజే 78,389 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే 45,283 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఒక్కరోజులో హుండీ ద్వారా ₹4.15 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజు మొత్తం 4.07 లక్షల లడ్డూలను విక్రయించారు. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్యసేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Spotlight

Read More →