TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! TTD Latest Updates: శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. క్యూ లైన్లలో సరికొత్త 'రీ-ఎంట్రీ' విధానం అమలు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల భారీ రద్దీ.. 24 గంటల నిరీక్షణ!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, శుభ ముహూర్తాలు కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు.

Published : 2026-05-26 09:34:00

తిరుమలలో కిటకిటలాడుతున్న భక్తులు.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్..

తిరుమలలో భక్తుల వెల్లువ.. శిలాతోరణం వరకు క్యూలైన్లు..

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, శుభ ముహూర్తాలు కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచే ఆలయ పరిసరాల్లో భారీగా రద్దీ కనిపించింది. ఉచిత దర్శనం కోసం ఏర్పాటు చేసిన అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.

టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు కూడా 3 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 6 గంటల వ్యవధిలో దర్శనం కల్పిస్తున్నారు.

నిన్న ఒక్కరోజే భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తం 89,399 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకోగా, వారిలో 49,985 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా నమోదైంది. ఒక్కరోజులోనే హుండీ ద్వారా రూ.4.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

లడ్డూ ప్రసాదాలకు కూడా భారీ డిమాండ్ కనిపించింది. నిన్న మొత్తం 4.88 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. భక్తుల రద్దీ కారణంగా వైద్య సేవలు కూడా విస్తృతంగా అందిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 3,751 మంది భక్తులకు వైద్య చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసింది. భక్తులు సహనంతో అధికారులకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Spotlight

Read More →