Indian Army: భవిష్యత్ యుద్ధాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధం..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్! Indian Army: భవిష్యత్ యుద్ధాలకు భారత సైన్యం పూర్తిగా సిద్ధం..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది!! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్! ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ప్రతి జిల్లలో.. New Scheme: కేంద్రం కీలక నిర్ణయం.. రూ.20 లక్షల కవరేజ్‌తో కొత్త బీమా ప్రారంభం..!! Commonwealth: కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ.. 75 ఏళ్ల పాటు దేశ పార్లమెంటుగా! Iran Warning: వారికి సహకరిస్తే మీపై దాడులు చేస్తాం.... పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్! Iran Nuclear: ఇరాన్‌పై అమెరికా దాడి జరిగితే ఏమవుతుంది? ట్రంప్ హెచ్చరికల వెనుక వ్యూహం ఇదే!! AP Government: ఏపీలో వారికి భారీ ఊరట! రూ.2,600 కోట్లు విడుదల... ఒక్కొక్కరి ఖాతాలో రూ.60,000! Sankranthi Gift: 45 ఏళ్ల తర్వాత పరిష్కారం.. సంక్రాంతి కానుకగా ఆ 2,111 కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయింపు! Trump shows: మిచిగాన్‌లో వివాదం.. ఉద్యోగికి మిడిల్ ఫింగర్ చూపించిన ట్రంప్!

Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్!

2025-12-20 08:52:00
BPCL: ఏపీకి రూ.96 వేల కోట్ల మెగా బూస్ట్…! బీపీసీఎల్ దేశంలోనే అతిపెద్ద ఇంధన ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రవాణా మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జిల్లాల వారీగా కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్లు రూపుదిద్దుకుంటుండటంతో సరుకు, ప్రయాణికుల రవాణా సౌలభ్యం పెంచే దిశగా హైవేల అభివృద్ధికి వేగం పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారులతో పాటు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకువెళుతోంది. ఈ క్రమంలో తాజాగా ఖరగ్‌పూర్ – కటక్ – విశాఖపట్నం – అమరావతి వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మొత్తం 446 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సరుకు రవాణా మరింత సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం..

ప్రస్తుతం కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై వాహనాల రద్దీ తీవ్రమైన స్థాయికి చేరింది. ముఖ్యంగా ఒంగోలు – కత్తిపూడి మధ్య ట్రాఫిక్ ఒత్తిడి లాజిస్టిక్స్ రంగానికి అడ్డంకిగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించడంతో పాటు అమరావతికి ఖరగ్‌పూర్, కటక్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో మెరుగైన అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కేంద్రానికి ప్రతిపాదించనున్నారు. ఈ రహదారి కృష్ణా, ఏలూరు, పోలవరం, చింతపల్లె, పాడేరు, పార్వతీపురం మన్యం మీదుగా ఒడిశాలోని కటక్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ వరకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ హైవేను అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో కూడా అనుసంధానం చేయనున్నారు.

Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్..

ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ సిద్ధం చేస్తోంది. డీపీఆర్ పూర్తైన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించి, ఆమోదం లభించిన తర్వాత టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్‌హెచ్–16కు ప్రత్యామ్నాయంగా ఒంగోలు – కత్తిపూడి వయా చీరాల జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలనే ప్రతిపాదనను కూడా కేంద్రానికి పంపింది. ఈ రహదారి విస్తరణ పూర్తైతే తీర ప్రాంత పరిశ్రమలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్‌కు భారీగా ఉపయోగపడనుంది.

క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..!

ఇక విశాఖపట్నం – రాయ్‌పూర్ జాతీయ రహదారి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ హైవేను వచ్చే ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే జాతీయ రహదారులు, గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల అభివృద్ధితో అమరావతిని ఒక కీలక లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు, ఎగుమతులు, పెట్టుబడులకు బలమైన కనెక్టివిటీ కల్పించడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ఉంది.

Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్..
Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్!
US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం!
Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Jeddah Tower: సౌదీ అరేబియాలో అద్భుత నిర్మాణం.. జెడ్డా టవర్‌తో కొత్త చరిత్ర!
AP Jobs Alert: ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్…! దేశవ్యాప్తంగా రద్దైన కార్డుల్లో 68% ఏపీవే..!

Spotlight

Read More →