కీర్తి సురేష్ ఫోటోలను వాడి సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ AI మార్ఫ్డ్ చిత్రాలు ఆమెను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. టెక్నాలజీ వేగంగా ఎదుగుతున్న ఈ కాలంలో, ఇలాంటి డీప్ఫేక్లు నటీనటుల వ్యక్తిగత గౌరవాన్ని నేరుగా దెబ్బతీస్తున్నాయని ఆమె స్పష్టంగా తెలిపారు. చెన్నైలో జరిగిన సమావేశంలో మాట్లాడిన కీర్తి, తాను ఎప్పుడూ ధరిచని దుస్తుల్లో లేదా ఎప్పుడూ పోజ్ ఇవ్వని రీతిలో వచ్చిన నకిలీ ఫోటోలు చూశాక ఒక్క క్షణం తానే సందేహానికి గురయ్యానని చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది.
ఫోటోలను చూసినప్పుడు ఇవి నిజంగానే ఉన్నాయేమో అని అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అవి నకిలీ అని తెలిసినప్పుడు తీవ్ర అసహనం, బాధ కలుగుతుంది అని ఆమె చెప్పిన మాటలు పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో తెలియజేస్తున్నాయి.
ఈ సమస్య కేవలం కీర్తి సురేష్ వరకే పరిమితం కాదు ఇటీవలి కాలంలో సమంత, రష్మిక మందన్న, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్ర జోనాస్ వంటి అనేక మంది నటి మణులు కూడా డీప్ఫేక్ల బారిన పడ్డారు. ముఖ్యంగా రష్మిక మీద వచ్చిన డీప్ఫేక్ వీడియో 2023లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో ఆమె లేనిపోని భంగిమల్లో చూపించబడడంతో అభిమానులు, సామాన్య ప్రజలు షాక్కు గురిచేసాయి చెప్పుకోవాలి.
సాయి పల్లవి కూడా ఇటీవల ఈ విషయంపై స్పందించారు తన సెలవుల్లో తీసుకున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఇవి నిజమైనవే, AI తయారు చేసినవి కావు అని సరదాగా వ్రాసి, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ఫోటోలపై ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆమె పేరుతో కూడా స్విమ్సూట్ల్లో ఉన్న నకిలీ AI ఫోటోలు వైరల్ అవ్వడం అభిమానులను అసహనానికి గురిచేసింది. అదే సమయంలో చాలామంది యువతీ యువకులు కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో చెప్పడం సమస్య ఎంత ప్రబలంగా ఉందో తెలియజేస్తోంది.
సమాజంలో వ్యక్తిగత హక్కులు, గౌరవం రక్షించుకోవడం ఎంత కష్టమైందో ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. ఎవరైనా వ్యక్తి ఫోటో తీసుకుని దాని మీద మార్పులు చేసి అసభ్యంగా చూపించడం నేరం మాత్రమే కాదు ఒకరి మనోభావాలపై దెబ్బతీసినట్లే చెప్పుకోవాలి. కానీ చాలామంది సిగ్గు, భయం వల్ల ఇలాంటి సంఘటనలను బయటపెట్టలేకపోతున్నారు. కీర్తి సురేష్, రష్మిక వంటి ప్రముఖులు ధైర్యంగా మాట్లాడటం వల్ల మరెంత మంది బాధితులు తమ అనుభవాలను చెబుతారని నిపుణులు భావిస్తున్నారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో డీప్ఫేక్లపై కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ను తొలగించడానికి ప్రత్యేక టీమ్లు ఏర్పాటు కావాలని, బాధితులు వెంటనే ఫిర్యాదు చేస్తే మాత్రమే నేరస్తులను నిలువరించగలమని చెబుతున్నారు. AI ఒక అద్భుతమైన సాంకేతికతే అయినా దాని దుర్వినియోగం మనిషి గౌరవం, భద్రతలను ప్రమాదంలో పడేస్తోంది.
మొత్తానికి, Privacy, Dignity, Consent ఈ మూడు డిజిటల్ యుగంలో అత్యంత ముఖ్యమైన విలువలు. వాటిని కాపాడుకోవడం వ్యక్తుల బాధ్యత మాత్రమే కాదు ప్రభుత్వం, సోషల్ మీడియా సంస్థలు, సమాజం మొత్తం కలసి పనిచేయాల్సిన అవసరం మరింత పెరిగింది