APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!

2026-01-01 15:11:00
RBI Guidelines: నేటి నుంచే ఆర్‌బీఐ కొత్త రూల్స్.. ఆ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్!

 ఎస్సీ వర్గాల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేలా చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్ సమన్వయంతో కొత్త రాయితీ రుణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే లబ్ధిదారులపై వడ్డీ భారం లేకుండా రుణ సాయం అందించడం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,400 మంది ఎస్సీ లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

ఈ పథకానికి అవసరమైన నిధులుగా ఇప్పటికే రూ.63.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం అజయ్‌తో అనుసంధానం చేస్తూ దీన్ని అమలు చేయనున్నారు. జనవరి మొదటి వారంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఎస్సీ జనాభా శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేశారు.

ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!

స్వయం ఉపాధి కోసం లబ్ధిదారులు ఎంచుకునేలా ప్రభుత్వం మొత్తం 56 రకాల ఉపాధి యూనిట్లను ప్రతిపాదించింది. చిన్న వ్యాపారాల నుంచి తయారీ రంగం వరకు విస్తృత అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఫుట్‌వేర్ వ్యాపారం, ప్యాసింజర్ ఆటోలు, మొబైల్ షాపులు, బేకరీలు, ఫుడ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి సేవారంగ ఉపాధులతో పాటు ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయాలు, జీడిపప్పు, బిస్కెట్ల తయారీ వంటి తయారీ రంగ వ్యాపారాలకూ అవకాశం కల్పించారు. ఒక్కో యూనిట్ విలువ కనీసం లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. యూనిట్ స్థాపనకు ప్రభుత్వం రూ.50 వేల వరకు రాయితీగా అందిస్తుంది.

ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!

ఈ పథకం మరో ముఖ్యాంశం ‘ఉన్నతి’ పథకంతో అనుసంధానం కావడమే. సాధారణంగా బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలకు వడ్డీ భారం తప్పదు. అయితే ఎస్సీ లబ్ధిదారులపై ఆ భారం పడకుండా చేయడానికి, సెర్ప్ పరిధిలో అమలవుతున్న ఉన్నతి పథకాన్ని ఉపయోగిస్తున్నారు. యూనిట్ విలువలో రాయితీ మినహాయించిన మిగిలిన మొత్తాన్ని డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణంగా అందిస్తారు. ఈ విధంగా లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో రుణాన్ని చెల్లించే సౌలభ్యం కల్పించారు.

APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!

ఇదిలా ఉండగా, స్వయం ఉపాధి ప్రోత్సాహానికి సంబంధించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. గతంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఈ పథకాన్ని ఇకపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తయారీ రంగంలో రూ.50 లక్షల వరకు, సేవారంగంలో రూ.20 లక్షల వరకు రుణ సాయం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం, పట్టణాల్లో 25 శాతం రాయితీ వంటి సౌకర్యాలు కొనసాగనున్నాయి.

భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!
Air India: భద్రతా నిబంధనలు గాలికొదిలిన పైలట్లు…! DGCA షోకాజ్ నోటీసులు!
సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

Spotlight

Read More →