Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు! Tourism: జీటీఎం 2026లో ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం! Hill Stations: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా... ఈ హిల్ స్టేషన్లకు వెళ్తే అసలు తిరిగి రావాలనిపించదు!! Flight Ticket: ప్రయాణీకులకు భారీ ఊరట... భారీగా తగ్గనున్న టికెట్ రేట్లు.. కేంద్రం కీలక నిర్ణయం! IRCTC Tour Package: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్... ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం... టికెట్ ధర ఎంతంటే? Hill Stations: స్కాట్ ల్యాండ్‌ను గుర్తు చేసే 5 భారత హిల్ స్టేషన్లు.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన అనుభవం! Schengen Visa: యూరోప్ షెంగెన్ వీసాలపై భారీ డిమాండ్.. 2025లో 1.2 కోట్లకు చేరిన దరఖాస్తులు! Hajj: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరుగుదల! India Trip: భారత్ పర్యటనకు రూ.10 లక్షలు ఖర్చు చేసిన అమెరికన్ జంట.. సోషల్ మీడియా లో వైరల్! RTC: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు.. ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు! Goa: ఘనంగా గోవా 40వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు!

Highway Extension: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఆ 15 జిల్లాల రహదారులకు మారనున్న రూపురేఖలు!

తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందబోతోంది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 1

Published : 2025-07-21 16:15:00

తెలంగాణలో రవాణా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందబోతోంది. ఇప్పటికే పలు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 15 జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న మొత్తం 1,123 కిలోమీటర్ల రోడ్లు త్వరలోనే నాలుగు లేన్లుగా మారనున్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.39,690 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు.

అధిక రద్దీ ఉన్న మార్గాల్లో విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రహదారులు, వేగవంతమైన రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచేలా ఈ ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టుల అమలుకు ముందు భూ సేకరణ, అటవీ మరియు పర్యావరణ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి. తర్వాత కేంద్రానికి నివేదిక పంపిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

విస్తరణ జరిగే రహదారుల్లో టోల్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రోడ్ల అభివృద్ధితో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆస్తి అభివృద్ధి రంగం కూడా పుంజుకునే అవకాశముంది. ముఖ్యంగా జాతీయ రహదారి 167లో జడ్చర్ల–కోదాడ మార్గం (219 కిలోమీటర్లు) అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు లేన్లు మాత్రమే ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్తరణకు ఎంపికైన ప్రధాన రహదారుల్లో జాతీయ రహదారి 63 (బోధన్–నిజామాబాద్, నిజామాబాద్–జగదల్‌పూర్), జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం, మన్నెగూడ–రావులపల్లి), జాతీయ రహదారి 365 (నకిరేకల్–తానంచర్ల, సూర్యాపేట–జనగాం), జాతీయ రహదారి 353సి (పరకాల, భూపాలపల్లి మారు మార్గం), జాతీయ రహదారి 61 (కళ్యాణ్–నిర్మల్) వంటి మార్గాలు ఉన్నాయి. ఇవి రవాణా దృక్పథంలో ప్రాధాన్యమైనవిగా, భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి మద్దతుగా నిలవనున్నాయి.

Spotlight

Read More →