Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ! Amazon India: అమెజాన్‌ భారీ AI ప్రణాళికలు... 2030 నాటికి భారత్‌లో..!! Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు! India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!! Social media: 19 నిమిషాల వైరల్ వీడియోలపై సోషల్ మీడియాలో సంచలనం.. నిజమా.. AI క్రియేషన్‌నా! Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు! Apples new VP: యాపిల్ AIకి కొత్త VP.. ఎవరీ అమర్ సుబ్రహ్మణ్య.. టెక్ ప్రపంచం ఫోకస్ అంతా Apple పై! 10 minute delivery: ఇండియా 2030లో ఉంది.. 10 నిమిషాల డెలివరీపై అమెరికా సీఈవో ఆశ్చర్యం! 11 years of research: 11 ఏళ్ల పరిశోధన ఫలితం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న లేజర్ డిఫెన్స్! Tech News: ఫోల్డబుల్ మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ N6.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను ఆకర్షించే ఫీచర్స్ ఇవే! Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ! Amazon India: అమెజాన్‌ భారీ AI ప్రణాళికలు... 2030 నాటికి భారత్‌లో..!! Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు! India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!! Social media: 19 నిమిషాల వైరల్ వీడియోలపై సోషల్ మీడియాలో సంచలనం.. నిజమా.. AI క్రియేషన్‌నా! Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు! Apples new VP: యాపిల్ AIకి కొత్త VP.. ఎవరీ అమర్ సుబ్రహ్మణ్య.. టెక్ ప్రపంచం ఫోకస్ అంతా Apple పై! 10 minute delivery: ఇండియా 2030లో ఉంది.. 10 నిమిషాల డెలివరీపై అమెరికా సీఈవో ఆశ్చర్యం! 11 years of research: 11 ఏళ్ల పరిశోధన ఫలితం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న లేజర్ డిఫెన్స్! Tech News: ఫోల్డబుల్ మార్కెట్‌లోకి ఒప్పో ఫైండ్ N6.. కొత్త లుక్ తో ఫ్యాన్స్ ను ఆకర్షించే ఫీచర్స్ ఇవే!

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!

2025-12-06 09:03:00
Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!

దేశ భద్రతను మరింత బలపరచడం, నేర కార్యకలాపాల దర్యాప్తును వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు లొకేషన్ సర్వీసులను ఆఫ్‌ చేసే పాత విధానానికి తెరపడే అవకాశముంది. ప్రతిపాదన ప్రకారం, ఫోన్లలో లొకేషన్ ఫీచర్‌ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండేలా టెక్నికల్ మార్పులు చేయాలని మొబైల్ తయారీదారులకు సూచించనున్నారు. నేర పరిశోధనల్లో ప్రతి సెకను, ప్రతి మీటర్‌ చాలా విలువైనదని భావిస్తున్న అధికార వర్గాలు ఈ మార్పు దేశవ్యాప్తంగా నిఘా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తుందని అంచనా వేస్తున్నాయి.

Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!

ప్రస్తుతం టెలికం కంపెనీలు నిందితులు లేదా అనుమానితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి సుమారు ఉన్న ప్రాంతాన్ని మాత్రమే గుర్తించగలుగుతున్నాయి. అయితే ఇది చాలా విస్తృతమైన పరిధి కావడంతో దర్యాప్తు అధికారులు ఖచ్చితమైన లొకేషన్‌ను నిర్ధారించడం కష్టమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ముందుకు తెచ్చిన కీలక సూచన ఏ-జీపీఎస్ టెక్నాలజీని అన్ని ఫోన్లలో తప్పనిసరిగా యాక్టివ్ చేయడమే. ఉపగ్రహ సిగ్నల్స్‌తో పాటు మొబైల్ డేటాను కూడా వినియోగించే ఈ టెక్నాలజీ, వ్యక్తి ఖచ్చితమైన స్థానం గురించి అతి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది నేరగాళ్లను క్షణాల్లో గుర్తించే అవకాశాన్ని పెంచుతుందని అధికారులు నమ్ముతున్నారు.

Praja Vedika: నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అయితే ఈ ప్రతిపాదనపై టెక్ దిగ్గజాలు — యాపిల్, గూగుల్, శాంసంగ్ — తీవ్ర వ్యతిరేకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. వినియోగదారుల ప్రైవసీ, వ్యక్తిగత స్వేచ్ఛ, డేటా భద్రత వంటి అంశాలపై భారీ సందేహాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే జులైలో ప్రభుత్వానికి లేఖ రాసి తమ ఆందోళనను తెలియజేశాయి. వినియోగదారుడు అనుమతించకుండానే లొకేషన్‌ను నిరంతరం ట్రాక్ చేయడం ప్రైవసీకి పెద్ద ప్రమాదమని, వ్యక్తిగత హమ్మీలను ఉల్లంఘించే చర్య అని వారు స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే లొకేషన్ డేటా హ్యాకింగ్, డేటా దుర్వినియోగం, అనధికారిక పర్యవేక్షణకు కూడా దారి తీస్తుందని ఈ కంపెనీల అభిప్రాయం.

AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి...

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదన సమీక్ష దశలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వినియోగదారుల గోప్యత, దేశ భద్రత—ఇవి రెండూ అత్యంత కీలకమైన అంశాలు కావడంతో ఈ నిర్ణయం సహజంగానే వివాదాస్పదంగా మారింది. నేరాలకు చెక్ పెట్టాలంటే టెక్నాలజీ సహాయం తప్పనిసరి అని చెప్పేవారు ఉన్నారు; మరోవైపు ప్రైవసీని రాజీపడలేమని చెప్పేవారి వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. చివరకు ప్రభుత్వం ఏ దిశలో నిర్ణయం తీసుకుంటుందో చూడాలి కానీ దేశ భద్రత, వ్యక్తిగత గోప్యత మధ్య సమతుల్యం సాధించడం ఇప్పటి పెద్ద సవాలుగా మారింది.

ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!
USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!
Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ!
AP Govt: తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం దృఢ నిర్ణయం…! కీలక మార్గదర్శకాలు జారీ!
అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..
Indigo Flights: ఇండిగో విమానాల రద్దుపై సీఈఓ క్లారిటీ..! అప్పటి నుండి సేవలు నార్మల్!

Spotlight

Read More →