LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Technology

israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో 'ఏఐ' మాయాజాలం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాటిలైట్ ఫోటోలు..!!

Artificial Intelligence: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కృత్రిమ మేధస్సు (AI) సాయంతో సృష్టిస్తున్న నకిలీ శాటిలైట్ చిత్రాలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాలు అసలు నిజాన్ని ఎలా మరుగున పరుస్తున్నాయో వీటి వల్ల కలిగే ముప్పుల గురించి వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో 'ఏఐ' మాయాజాలం... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శాటిలైట్ ఫోటోలు..!!

Artificial Intelligence: ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కేవలం తుపాకులు, క్షిపణులే కాదు, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధస్సు సాయంతో సృష్టిస్తున్న నకిలీ శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజమైన ఫోటో ఏదో, ఏఐ సృష్టించిన నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతగా ఈ చిత్రాలు ఉంటున్నాయి. దీనివల్ల యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలియక సామాన్య ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

ఇటీవల ఇరాన్‌కు చెందిన ఒక పత్రిక ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్లు ఒక శాటిలైట్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అయితే, నిశితంగా పరిశీలించిన నిపుణులు అది పాత గూగుల్ ఎర్త్ ఫోటోను ఏఐ సాయంతో మార్చినట్లు గుర్తించారు. ఆ చిత్రంలో కార్లు ఉన్న చోటే ఉండటం, కొన్ని చోట్ల ఫోటోలు మసకగా ఉండటాన్ని గమనించారు. అయినప్పటికీ, ఆ నకిలీ ఫోటో అప్పటికే కోట్లాది మందికి చేరుకోవడంతో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించింది.

ఎక్కడ దాడులు జరిగాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి శాటిలైట్ చిత్రాలు చాలా కీలకం. గతంలో ఇలాంటి సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడేవారు. కానీ ఇప్పుడు ఏఐ పుణ్యమా అని ఎవరికి వారే ఫోటోలను సృష్టించి వదులుతున్నారు. దీనివల్ల యుద్ధం గురించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడటమే కాకుండా, స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కేవలం ఇజ్రాయిల్-ఇరాన్  యుద్ధమే కాకుండా, గతంలో రష్యా-ఉక్రెయిన్  భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు కూడా ఇలాంటి నకిలీ చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ తప్పుడు సమాచారం వల్ల అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. యుద్ధం నేపథ్యంలో ఏ దేశం గెలుస్తోంది, ఏ దేశం నష్టపోయింది అనే దానిపై స్పష్టత లేకుండా చేసేందుకు కొన్ని శక్తులు కావాలనే ఇలాంటి 'డిజిటల్ మాయాజాలాన్ని' వాడుతున్నాయి.

 సోషల్ మీడియాలో వచ్చే ప్రతి శాటిలైట్ చిత్రాన్ని గుడ్డిగా నమ్మకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ సృష్టించిన చిత్రాల్లో కొన్ని చిన్న చిన్న తప్పులు (లాజిక్ లేని యాంగిల్స్, అక్షర దోషాలు) ఉంటాయి. వాటిని గమనించడం ద్వారా నిజానిజాలు తెలుసుకోవచ్చు. యుద్ధం లాంటి సున్నితమైన విషయాల్లో అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడటమే ఉత్తమమని  చెబుతున్నారు.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…