LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు!

Kondapalli Srinivas: విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులపై క్రెడిట్ దోచుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

AndhraPravasi News Desk 2 min read
Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు!

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైసీపీ అబద్ధపు ప్రచారం..

ఐదేళ్లు తాగునీటి సమస్య పట్టించుకోని వైసీపీపై మంత్రి విమర్శలు..

విజయనగరం జిల్లాలో అభివృద్ధి పనులపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు వంటి కీలక ప్రాజెక్టులపై క్రెడిట్ దోచుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. గజపతినగరంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు, మూలపేట పోర్టు వంటి ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవేనని గుర్తుచేసిన మంత్రి, ఇప్పుడు వాటిని తామే నిర్మించామని చెప్పుకోవడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అభివృద్ధి గురించి చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతోనే బట్ట కాల్చి మొఖంపై వేసినట్టుగా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మానాపురం బ్రిడ్జి పనులు గత టీడీపీ ప్రభుత్వంలోనే మంజూరయ్యాయని, అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో 20 శాతం పనులు కూడా పూర్తికాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఆ బ్రిడ్జి పూర్తి చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నామని తెలిపారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న భోజరాజపురం, పి.లింగాలవలస, పాపయ్యవలస గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూసిన ఈ సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

దత్తిరాజేరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.8 కోట్లతో కొన్ని పనులు పూర్తి చేసి, మరిన్ని తాగునీటి సమస్యల పరిష్కారం కోసం మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించామని వెల్లడించారు. ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.

గజపతినగరంలో అన్నా క్యాంటీన్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని మంత్రి తెలిపారు. ప్రతిరోజూ సుమారు 800 మందికి కేవలం రూ.5కే కడుపునిండా భోజనం అందిస్తున్నామని చెప్పారు. పేదల ఆకలి తీర్చడంలో అన్నా క్యాంటీన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గత రెండేళ్లలో నియోజకవర్గంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను పెద్దఎత్తున పరిష్కరించామని, గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిని కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై కూడా మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. చెత్త నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రెండేళ్లలో రూ.1300 కోట్లతో లక్ష టన్నుల చెత్తను ప్రాసెస్ చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా పరిశుభ్రత, క్రమశిక్షణ పాటిస్తున్న తీరు చూసి ప్రేరణ పొందామని, మన రాష్ట్రంలో కూడా ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…