LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Chandrababu: డిగ్రీలకే పరిమితం కాదు.. ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు.. -సీఎం చంద్రబాబు!

Chandrababu: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని విశ్వవిద్యాలయాల పాత్ర, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడారు.

AndhraPravasi News Desk 2 min read
Chandrababu: డిగ్రీలకే పరిమితం కాదు.. ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు.. -సీఎం చంద్రబాబు!

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఏయూ దిక్సూచి..

గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుతో విశాఖకు కొత్త చరిత్ర..

విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని విశ్వవిద్యాలయాల పాత్ర, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడారు.

విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలు మాత్రమే కాకుండా, సమాజాన్ని మార్చే ఆవిష్కరణలకు వేదిక కావాలని సీఎం అన్నారు. యూనివర్సిటీలు జాతీయ ఆస్తులని, వాటిని కాపాడటం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 53 విశ్వవిద్యాలయాలకు ఆంధ్ర యూనివర్సిటీ దిక్సూచిగా నిలుస్తోందని కొనియాడారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీలో రూ.64 కోట్లతో నిర్మించిన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్‌ను ప్రారంభించారు. మరో రూ.112 కోట్లతో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్, కాన్వకేషన్ హాల్ సహా 9 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, “మీరు జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్ కావాలి. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్‌పై దృష్టి పెట్టాలి. మీరు ఉద్యోగం చేయడమే కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలి” అని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

విశాఖలో త్వరలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందని, దాదాపు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి రానుందని సీఎం తెలిపారు. ఇది విశాఖకు కొత్త చరిత్ర సృష్టించబోతుందని చెప్పారు. ఇప్పటికే 58 దేశాల విద్యార్థులు ఏయూలో చదువుతున్నారని, విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రను స్మరించుకుంటూ, జైపూర్ రాజ్ విక్రమదేవ్, గజపతి, పిఠాపురం, బొబ్బిలి రాజులు ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు. తొలి వైస్ చాన్స్‌లర్ కట్టమంచి రామలింగారెడ్డి బలమైన పునాది వేశారని, రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతిగా ఎదిగారని తెలిపారు.

“నాకు 76 ఏళ్లు అయినా, నేను ఇంకా 26 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తాను” అంటూ సీఎం తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినట్లు, ఇప్పుడు డేటా సెంటర్లు, ఏఐ, క్వాంటం టెక్నాలజీలపై దృష్టి పెట్టామని చెప్పారు. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకోవాలని, విదేశీ విద్యార్థులను ఆకర్షించాలని సూచించారు.

ఏయూ అభివృద్ధికి రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కార్పస్ ఫండ్ రూపంలో ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. భవిష్యత్తులో ఏయూ దేశంలో టాప్-5లో, ప్రపంచంలో టాప్-100లో ఉండాలని లక్ష్యంగా పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ హరిబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అలాగే ప్రముఖులు సచిన్ టెండూల్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చివరగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, “స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ జైత్రయాత్ర ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ప్రారంభం కావాలి. పని చేసే బాధ్యత మాది, దాన్ని విజయవంతం చేసే బాధ్యత మీది” అని పిలుపునిచ్చారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…