LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

Amit Shah: దేశ భవిష్యత్తును కాపాడాలంటే మాదకద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి “డ్రగ్ ఫ్రీ ఇండియా” సాధించడమే దేశ జాతీయ లక్ష్యమని తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Amit Shah: 2047 నాటికి మాదకద్రవ్య రహిత భారత్‌ను సాధించాలనేదే జాతీయ లక్ష్యం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

2047 నాటికి “డ్రగ్ ఫ్రీ ఇండియా” సాధించడమే దేశ జాతీయ లక్ష్యం..

మాదకద్రవ్యాలపై “జీరో టాలరెన్స్” విధానం కఠినంగా అమలు..

దేశ భవిష్యత్తును కాపాడాలంటే మాదకద్రవ్యాల నిర్మూలన అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి “డ్రగ్ ఫ్రీ ఇండియా” సాధించడమే దేశ జాతీయ లక్ష్యమని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేవలం చట్టవ్యవస్థ సమస్య మాత్రమే కాకుండా సమాజం, యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకర అంశమని ఆయన హెచ్చరించారు.

రామేశ్వర నాథ్ కావ్ స్మారకార్థం ప్రతి ఏడాది నిర్వహించే ఆర్.ఎన్.కావో మెమోరియల్ లెక్చర్‌లో పాల్గొన్న అమిత్ షా, దేశ భద్రతా సంస్థలు డ్రగ్ సిండికేట్లను పూర్తిగా కూల్చివేసేందుకు ప్రత్యేక రోడ్‌మ్యాప్ సిద్ధం చేశాయని వెల్లడించారు. మాదకద్రవ్యాలపై “జీరో టాలరెన్స్” విధానాన్ని భారత్ కఠినంగా అమలు చేస్తోందని చెప్పారు.

భారత్ భూభాగాన్ని మాదకద్రవ్యాల రవాణా మార్గంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించనివ్వమని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలోకి ఒక్క గ్రాము డ్రగ్స్ కూడా రానీయకుండా, దేశం నుంచి బయటకు వెళ్లనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

డ్రగ్ మాఫియా ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాద, నేర గ్యాంగులకు చేరుతూ సమాంతర ఆర్థిక వ్యవస్థకు దారి తీస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే దీర్ఘకాలిక నష్టం చాలా సార్లు కనిపించకపోయినా, అది సమాజాన్ని లోపల నుంచి బలహీనపరుస్తుందని చెప్పారు.

డ్రగ్స్ నిర్మూలనలో ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా సూచించారు. దేశాల మధ్య చట్టాల్లో ఉన్న తేడాలను డ్రగ్ కార్టెల్స్ తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. నిషేధిత పదార్థాల నిర్వచనం, శిక్షల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఒకే విధమైన చట్టాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలంటే రియల్‌టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ ఎంతో అవసరమని చెప్పారు. గత రెండేళ్లలో స్నేహపూర్వక దేశాల సహకారంతో 40 మందికిపైగా అంతర్జాతీయ నేరస్థులను భారత్‌కు తిరిగి తీసుకురాగలిగామని వెల్లడించారు.

డ్రగ్స్‌పై పోరాటం జాతీయ భద్రత, ప్రజారోగ్యం, యువత భవిష్యత్తుతో నేరుగా సంబంధం ఉన్న అంశమని అమిత్ షా పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యూనీఫార్మ్ లాస్, ఇంటెలిజన్స్ షేరింగ్, ఎక్స్ట్రాడిషన్ అగ్రీమెంట్స్ వంటి అంశాల్లో అంతర్జాతీయ సహకారం మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…