LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Minister Savitha: చేనేతలకు ఆదాయం, ఆరోగ్య భద్రతే లక్ష్యం.. -మంత్రి సవిత!

Minister Savitha: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూ, వారి ఆదాయం పెంచడంతో పాటు ఆరోగ్య భద్రతను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

AndhraPravasi News Desk 2 min read
Minister Savitha: చేనేతలకు ఆదాయం, ఆరోగ్య భద్రతే లక్ష్యం.. -మంత్రి సవిత!

ఉచిత విద్యుత్ పథకం కింద వారికి కరెంట్ బిల్లులు అందజేత..

ఉచిత విద్యుత్ పథకం ద్వారా నేతన్నలకు సంవత్సరానికి రూ.8,640 వరకు లాభం..

శ్రీసత్యసాయి జిల్లా: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూ, వారి ఆదాయం పెంచడంతో పాటు ఆరోగ్య భద్రతను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో పలువురు చేనేత కుటుంబాలను మంత్రి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ పథకం కింద వారికి కరెంట్ బిల్లులను అందజేసి, ఆ పథకం వల్ల కలిగిన ప్రయోజనాలను తెలుసుకున్నారు. చేనేత కుటుంబాలు జీరో పేమెంట్ బిల్లులను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, ఉచిత విద్యుత్ పథకం ద్వారా మగ్గం నేతన్నలకు నెలకు రూ.720, సంవత్సరానికి రూ.8,640 వరకు లాభం కలుగుతుందని చెప్పారు. మరమగ్గం మీద పని చేసే కుటుంబాలకు నెలకు రూ.1,800, సంవత్సరానికి రూ.21,600 వరకు ఆదా అవుతుందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55,405 మగ్గం నేతన్నల కుటుంబాలు, 8,611 మరమగ్గం కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా గుర్తించామని, మిగిలిన అర్హులకూ ఈ ప్రయోజనం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. చేనేత ఉత్పత్తులను పెంచడం, నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడం లక్ష్యంగా టెక్స్‌టైల్ పార్కులు, మెగా మరియు మినీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారికి ఎంఎస్ఎంఈ పార్కుల్లో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.

అదేవిధంగా, 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు రూ.4,000 పెన్షన్ అందజేస్తున్నామని, త్రిఫ్ట్ ఫండ్ కోసం ప్రతి సంవత్సరం రూ.5 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ముద్ర రుణాలు, 15% సబ్సిడీతో నూలు, 90% సబ్సిడీతో మగ్గం పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. ఆప్కో ద్వారా ఎగ్జిబిషన్లు నిర్వహించి అమ్మకాలు పెంచడమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేస్తున్నామని వివరించారు.
చేనేత కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ యూనివర్శల్ హెల్త్ పాలసీని కూడా తీసుకురానున్నామని మంత్రి సవిత వెల్లడించారు.

మంత్రి సందర్శన సందర్భంగా చేనేత కుటుంబాలు ఆమెను ఘనంగా సత్కరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…