LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఇవే!

Telangana Budget 2026-27: తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.30 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, యంగ్ ఇండియా స్కూల్స్ వంటి కీలక పథకాలకు కేటాయించిన నిధుల వివరాల..

AndhraPravasi News Desk 2 min read
Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ ఇవే!

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది భారీ బడ్జెట్‌ను సిద్ధం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్ అంచనాలను గణనీయంగా పెంచారు. దాదాపు రూ. 3.30 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా సంక్షేమం, వ్యవసాయం, విద్య  మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. గతేడాది బడ్జెట్ రూ. 3.04 లక్షల కోట్లు ఉండగా, ఈసారి సుమారు 25 వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడం విశేషం.

బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజా భవన్ వద్ద ఉన్న నల్ల పోచమ్మ ఆలయంలో బడ్జెట్ ప్రతులకు పూజలు చేసిన అనంతరం ఆయన నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈసారి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు భారీగా నిధులను మళ్లించారు.

విద్యారంగంలో సమూల మార్పుల కోసం ప్రభుత్వం 'యంగ్ ఇండియా స్కూల్స్' పేరుతో నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తోంది. దీని కోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం ఈ బడ్జెట్ ప్రధాన ఉద్దేశం. వైద్య రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదలకు, కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణకు నిధులను సర్దుబాటు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి తరహాలోనే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా, రుణమాఫీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇచ్చింది. సాగునీటి రంగానికి సుమారు రూ. 26 వేల కోట్లు కేటాయించడం ద్వారా రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాల్వల మరమ్మతులు, కొత్త ఆయకట్టుకు నీరు అందించే పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు పరిశ్రమల స్థాపనకు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ పనులకు నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ బడ్జెట్ కేవలం అంకెలే కాకుండా, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉంటుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. పన్నుల భారతం లేకుండా ఆదాయ వనరులను పెంచుకోవాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు బడ్జెట్ కేటాయింపులపై ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. శాసనసభలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా, అటు శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రతులను సభ ముందు ఉంచారు. మొత్తం మీద ఈ ఏడాది బడ్జెట్ తెలంగాణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Be the first to react

More Coverage

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!

Liquor Scam: మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం, ఆ తర్వాత మద్యాన్ని…

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…